Vijay Deverakonda: ట్రోల్స్ పై స్పందించిన విజయ్ దేవరకొండ.. అప్పుడు వాళ్లు.. ఇప్పుడు వీళ్లు అంటూ..

దేశవ్యాప్తంగా ఆడియన్స్ ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 25న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో విడుదల కానుంది. ఈ క్రమంలో మీడియాతో

Vijay Deverakonda: ట్రోల్స్ పై స్పందించిన విజయ్ దేవరకొండ.. అప్పుడు వాళ్లు.. ఇప్పుడు వీళ్లు అంటూ..
Vijay Ananya
Follow us

|

Updated on: Aug 16, 2022 | 2:29 PM

మోస్ట్ అవైయిటెడ్ చిత్రం లైగర్. ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీలో విజయ్ (Vijay Deverakonda) బాక్సర్ గా కనిపిస్తుండగా.. అతని సరసన అనన్య పాండే నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్, పోస్టర్స్ ఫుల్ హైప్ క్రియేట్ చేశాయి. దేశవ్యాప్తంగా ఆడియన్స్ ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 25న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో విడుదల కానుంది. ఈ క్రమంలో మీడియాతో ఇంట్రాక్ట్ అయ్యారు విజయ్. విలేకర్లు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలీలో సమాధానాలు ఇచ్చారు. అదే సమయంలో ట్రోల్స్ గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో సోషల్ మీడియా ట్రోల్స్ గురించి ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు విజయ్ స్పందిస్తూ.. ట్రోల్స్ చేయడం కామన్. రోజు జరిగే విషయమే. నేను హీరో, నటుడు కాకముందు కూడా నన్ను మా అంకుల్స్, ఆంటీస్ , కాలేజీలో స్నేహితులు, సన్నిహితులు ట్రోల్ చేసేవారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ జరుగుతుంది. అది ఏ విషయమైన కావచ్చు. ట్రోలింగ్ అనేది ఎప్పుడు జరుగుతుంది. నేను పెద్దగా పట్టించుకోను అంటూ చెప్పుకొచ్చారు విజయ్.

ఇవి కూడా చదవండి

అలాగే. తనకు రీమేకులు ఫ్రీమేకులు ఇష్టం ఉండదని.. ఆ సినిమా కథతో కొంచెం పోలిక వున్న చేయనని.. పైగా లైగర్ లో వున్నది బాక్సింగ్ కాదు. ఎంఎంఎ అనే మార్షల్ ఆర్ట్స్. అమ్మా నాన్న తమిళమ్మాయితో లైగర్ కి ఎలాంటి పోలిక లేదని అన్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.