Tollywood: మేడమ్ సార్ మేడమ్ అంతే.. ఆపద్బాంధవుడు హీరోయిన్ లేటెస్ట్ లుక్ చూస్తే స్టన్

ఔరా అమ్మకు చెళ్ల అంటూ ఆపద్బాంధవుడు చిత్రంలో చిరంజీవి సరసన ఆడిపాడిన హీరోయిన్ మీనాక్షి శేషాద్రి గుర్తుంది కదా. తను ఇప్పుడు ఎలా ఉన్నారు.. ఏం చేస్తున్నారా..? మళ్లీ ఇండస్ట్రీ ఎంట్రీ ఇస్తారా... ఈ ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం పదండి...

Tollywood: మేడమ్ సార్ మేడమ్ అంతే.. ఆపద్బాంధవుడు హీరోయిన్ లేటెస్ట్ లుక్ చూస్తే స్టన్
Meenakshi Seshadri
Follow us

|

Updated on: Oct 17, 2024 | 3:40 PM

మీనాక్షి శేషాద్రి.. ఈమె తెలుగు ప్రేక్షకులకు చాలా సుపరిచితమే. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోలతో ఆడిపాడింది. మ్యారేజ్ తర్వాత అమెరికాలో సెటిల్ అయింది. ఈ హీరోయిన్ అసలు పేరు శశికళ శేషాద్రి. ఈమె జార్ఖండ్ రాష్ట్రంలోని సింధిలో పుట్టింది. తమిళ కుటుంబానికి చెందిన మీనాక్షి శేషాద్రి.. కూచిపూడి, భరతనాట్యం, కథక్, ఒడిసి లాంటి డాన్సులలో ప్రావీణ్యం సాధించింది. ఢిల్లీలో చదువుకునే సమయంలోనే మిస్ ఇండియాలో పాల్గొని సెలక్ట్ అయ్యింది. ఇక మోడల్‌గా చాన్సులు రావడంతో.. టాప్ ప్లేస్‌కు వెళ్లింది. అలా ప్రయాణంలో ఆమె సినిమా ఇండస్ట్రీకి దగ్గరైంది. పెయింటర్ బాబుతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి, హిరో సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుని.. ఒక్కరోజులో స్టార్ స్టేటస్ అందుకుంది. అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, రాజేష్ ఖన్నా, సన్ని డియోల్ వంటి అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది. అంతేకాదు మీనాక్షి1980-90లలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్‌గా సంచలనం రేపింది. బాలీవుడ్‌లో 30కి పైగా చిత్రాల్లో నటించింది మీనాక్షి. తెలుగులోనూ మెగాస్టార్ చిరంజీవితో ఆపద్బాంధవుడు సినిమాలో కలిసి నటించింది.  సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ కలిసి నటించిన విశ్వామిత్ర మూవీలో మేనక పాత్ర పోషించింది.

1995లో హరీష్ మైసూర్ అనే వ్యక్తిని పెళ్లాడి.. ఇండస్ట్రీకి దూరమయ్యారు మీనాక్షి. భర్త, ఇద్దరు పిల్లలతో అమెరికాలో సంతోషంగా  కుటుంబంతో గడుపుతున్నారు. అక్కడ ఆమె ఆసక్తి ఉన్నవారికి భరతనాట్యం, కథక్, ఒడిస్సీ నృత్యాలు నేర్పుతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికీ ఆమెను ఫాలో అవుతోన్న తెలుగు అభిమానులు ఎందరో ఉన్నారు. మీనాక్షి శేషాద్రి లేటెస్ట్ ఫోటోస్ చూసేద్దాం పదండి…

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆపద్బాంధవుడు హీరోయిన్ గుర్తుందా..? తన లేటెస్ట్ లుక్ చూశారా
ఆపద్బాంధవుడు హీరోయిన్ గుర్తుందా..? తన లేటెస్ట్ లుక్ చూశారా
ఏపీ ఎస్‌సీఈఆర్టీలో టీచింగ్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల
ఏపీ ఎస్‌సీఈఆర్టీలో టీచింగ్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల
పాపా.. పార్వతి ఇది నువ్వేనా..!!
పాపా.. పార్వతి ఇది నువ్వేనా..!!
రామయ్య లంక నుంచి అయోధ్య ప్రయాణానికి మధ్య లింక్.. ట్వీట్ వైరల్
రామయ్య లంక నుంచి అయోధ్య ప్రయాణానికి మధ్య లింక్.. ట్వీట్ వైరల్
సీజన్ మారే క్రమంలో వచ్చే గొంతు నొప్పి, దగ్గును ఇలా తగ్గించుకోండి.
సీజన్ మారే క్రమంలో వచ్చే గొంతు నొప్పి, దగ్గును ఇలా తగ్గించుకోండి.
భారత్‌లో తలదాచుకుంటున్న మాజీ ప్రధానిపై అరెస్టు వారెంట్‌ జారీ..
భారత్‌లో తలదాచుకుంటున్న మాజీ ప్రధానిపై అరెస్టు వారెంట్‌ జారీ..
శ్రీవారిని దర్శించుకున్న రాశి.. ఇప్పుడెలా మారిపోయిందో చూశారా?
శ్రీవారిని దర్శించుకున్న రాశి.. ఇప్పుడెలా మారిపోయిందో చూశారా?
రోజుకు ఒక గుప్పెడు తిన్నా.. ఊహించలేనన్ని బెనిఫిట్స్!
రోజుకు ఒక గుప్పెడు తిన్నా.. ఊహించలేనన్ని బెనిఫిట్స్!
3,500 జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టుల భర్తీ ఈ నెల్లోనే నోటిఫికేషన్
3,500 జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టుల భర్తీ ఈ నెల్లోనే నోటిఫికేషన్
బాలయ్యతో విబేధాలపై స్పందించిన తారక్.. క్లియర్ కట్‌గా
బాలయ్యతో విబేధాలపై స్పందించిన తారక్.. క్లియర్ కట్‌గా