Sai Pallavi: జార్జియాలో ఎంబీబీఎస్.. స్టార్ హీరోలకు మించిన క్రేజ్.. సాయి పల్లవి ఆస్తులు తెలిస్తే..
ప్రస్తుతం సినీ రంగంలో స్టార్ హీరోలకు మించిన క్రేజ్ సొంతం చేసుకుంది సాయి పల్లవి. న్యాచురల్ లుక్, సహజ నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ ముద్దుగుమ్మ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఫ్యాన్స్, సెలబ్రెటీస్ సోషల్ మీడియా వేదికగా ఆమెకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. అలాగే ఈ బ్యూటీ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు.

న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి.. ప్రస్తుతం దక్షిణాదిలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగులో సాయి పల్లవిని లేడీ పవర్ స్టార్ అని ముద్దుగా పిలుస్తుంటారు. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ కంటెంట్, ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవలే తండేల్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సాయి పల్లవి ప్రస్తుతం హిందీలో రామాయణం చిత్రంలో నటిస్తుంది. ఇందులో సీతమ్మ పాత్రలో కనిపించనుంది. ఈరోజు మే 9న సాయి పల్లవి పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. చిన్న వయసులోనే డ్యాన్స్ అంటే ఇష్టంతో ఉన్న ఈ అమ్మడు.. రియాల్టీ షోస్, డ్యాన్స్ షోలలో పాల్గొంది. ఆ తర్వాత చదువుల పై ఫోకస్ పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. జార్జియాలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసింది.
2015లో ప్రేమమ్ సినిమాతో మలయాళీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది సాయి పల్లవి. అల్ఫోన్స్ పుతిరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటుడు నివిన్ పౌలీ ప్రధాన పాత్రలో నటించారు. ఇందులో కాలేజీ లెక్చరర్ పాత్రలో అందం, అభినయంతో కట్టిపడేసింది. మొదటి సినిమాతోనే నటిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సాయి పల్లవి టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఇటీవలే అమరన్, తండేల్ చిత్రాలతో వరుస విజయాలను ఖాతాలో వేసుకుంది ఈ అమ్మడు. ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న నితీష్ తివారీ రామాయణం చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రానికి సాయి పల్లవి భారీగా పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్.
సాయి పల్లవి తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించింది. ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకు రూ.10 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. అలాగే నివేదికల ప్రకారం సాయి పల్లవి ఆస్తులు రూ.50 కోట్లకు పైగానే ఉన్నాయట. కంటెంట్ బలంగా ఉన్న చిత్రాలను ఎంచుకుంటున్న సాయి పల్లవి.. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లకు విభిన్నం. ఇప్పటివరకు తన వద్దకు వచ్చిన పలు యాడ్స్ సున్నితంగ తిరస్కరించింది. అలాగే గ్లామర్ షో ఉన్న పాత్రలను రిజెక్ట్ చేసింది.
ఇవి కూడా చదవండి :
Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?
Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..