AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అమ్మ బాబోయ్.. రచ్చ మూవీలో నటించిన ఈ పాప.. ఇప్పుడు హీరోయిన్

ఏంటి గురూ.. ఈ మేకోవర్స్.. నిన్నమొన్నటివరకు బాలనటీనటులుగా అలరించినవాళ్లు ఇప్పుడు హీరో హీరోయిన్స్ అయిపోతున్నారు. రచ్చ మూవీలో చిన్పప్పుడు తమన్నా క్యారెక్టర్‌లో నటించిన ఈ పాప ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్‌‌గా రాణిస్తోంది. తనని గుర్తుపట్టారా..?

Tollywood: అమ్మ బాబోయ్.. రచ్చ మూవీలో నటించిన ఈ పాప.. ఇప్పుడు హీరోయిన్
Vishika Kota
Ram Naramaneni
|

Updated on: Oct 19, 2024 | 1:18 PM

Share

టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. బాల నటీనటులుగా అలరించినవాళ్లు.. ఇప్పుడు హీరోహీరోయిన్లుగా టర్న్ అవతున్నారు. వారికి సక్సెస్ రేషియో కూడా బాగానే ఉంది. తేజ సజ్జా, కావ్య కల్యాణ్ రామ్ వంటి వాళ్లు ఈ కోవకు చెందినవాళ్లే. ఈ జాబితాలోనే చేరింది మరో నటి.  ‘రామ్ చరణ్’ హీరోగా నటించిన ‘రచ్చ’ మూవీతో తమన్నా చిన్నప్పటి క్యారెక్టర్ చేసిన బాలనటి ప్రస్తుతం హీరోయిన్‌గా అయిపోయింది. ఆ అమ్మాయి పేరు విశికా కోటా. ఈ అమ్మడు ప్రస్తుతం ‘ ఏందిరా ఈ పంచాయితీ, సగిలేటి కథ’ లాంటి మూవీల్లో హీరోయిన్‌ నటించింది. మరికొన్ని సినిమాల్లో కూడా కీలక పాత్రల్లో మెరిసింది.

గతంలో  ఓ ఇంటర్వ్యూకు హాజరైన విశికా పలు విషయాలను పంచుకుంది. “రచ్చ సినిమానే కాకుండా చాలా చిత్రాల్లో నటించాను. ఆ మూవీ షూటింగ్ సమయంలో నేను చరణ్, తమన్నాను కలవలేదు. చిత్రీకరణ సమయంలో వాళ్లు అక్కడ లేరు. ఇప్పుడు వారు నన్ను చూసినా అస్సలు గుర్తుపట్టే చాన్స్ లేదు.’’ అంటూ విషికా వెల్లడించింది. జూలై 19, 1998న తెలంగాణలోని హైదరాబాద్‌లో జన్మించింది. మె గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, ఆపై  యాక్టింగ్‌వైపు అడుగులు వేసింది. పాత్రా ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో నటించేందుకు విశిక ఆసక్తి కనబరుస్తుంది. అయితే ఈ బ్యూటీ నిత్యం హాట్ హాట్ ఫోటోలు నెట్టింట షేర్ చేస్తోంది. ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు.. ఈ తెలుగు బ్యూటీకి మంచి అవకాశాలు ఇవ్వాలని అని కామెంట్స్ పెడుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.