AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drug Case: గచ్చిబౌలి పోలీస్‏స్టేషన్‏కు డైరెక్టర్ క్రిష్.. డ్రగ్స్ కేసుపై విచారించనున్న పోలీసులు..

రాడిసన్ డ్రగ్స్ కేసు రోజు రోజుకీ అనుహ్య మలుపులు తిరుగుతుంది. ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న డ్రగ్స్ సప్లైయర్ అబ్బాస్‏ విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. మీర్జా వహీద్ అనే వ్యక్తి దగ్గర కొకైన్ కొనుగోలు చేసి దానిని గజ్జల వివేకానంద్ డ్రైవర్ గద్దల ప్రవీణ్ కు అప్పగిస్తున్నట్లు విచారణలో తేలింది. దీంతో ఈ కేసులో మరో ఇద్దరిని నిందితులుగా చేర్చారు పోలీసులు. ఏ11గా వివేకానంద్ డ్రైవర్ గజ్జల ప్రవీణ్..

Drug Case: గచ్చిబౌలి పోలీస్‏స్టేషన్‏కు డైరెక్టర్ క్రిష్.. డ్రగ్స్ కేసుపై విచారించనున్న పోలీసులు..
Director Krish
Rajitha Chanti
|

Updated on: Mar 01, 2024 | 8:54 AM

Share

హైదరాబాద్ రాడిసన్ పబ్‍లో డ్రగ్స్ పార్టీ కేసులో పోలీసుల విచారణ వేగవంతగా సాగుతుంది. ఈ కేసులో ఏ10 నిందితుడిగా డైరెక్టర్ క్రిష్ పేరును చేర్చారు పోలీసులు. ఇందులో భాగంగా ఈరోజు (మార్చి 1న) విచారణకు హాజరుకానున్నారు క్రిష్. తాను ముంబైలో ఉన్న కారణంగా విచారణకు హాజరు కాలేకపోతున్నానని శుక్రవారం రోజు వస్తానని పోలీసులకు విజ్ఞప్తి చేశారు క్రిష్. ఈరోజు గచ్చిబౌలీ పోలీసుల ముందుకు రానున్నారు. ఈ క్రమంలోనే ఆయన డ్రగ్స్ తీసుకున్నారా ? లేదా? అనేది విచారణలో తేల్చనున్నారు. అలాగే అతడికి వైద్య పరీక్షలు నిర్వహించాలని పోలీసులు భావిస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటికే క్రిష్‏ను విచారణకు హాజరు కావలసిందిగా స్పష్టం చేశారు గచ్చిబౌలీ పోలీసులు.

రాడిసన్ డ్రగ్స్ కేసు రోజు రోజుకీ అనుహ్య మలుపులు తిరుగుతుంది. ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న డ్రగ్స్ సప్లైయర్ అబ్బాస్‏ విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. మీర్జా వహీద్ అనే వ్యక్తి దగ్గర కొకైన్ కొనుగోలు చేసి దానిని గజ్జల వివేకానంద్ డ్రైవర్ గద్దల ప్రవీణ్ కు అప్పగిస్తున్నట్లు విచారణలో తేలింది. దీంతో ఈ కేసులో మరో ఇద్దరిని నిందితులుగా చేర్చారు పోలీసులు. ఏ11గా వివేకానంద్ డ్రైవర్ గజ్జల ప్రవీణ్.. ఏ12గా మీర్జా వహీద్ పేరును చేర్చారు పోలీసులు. గతేడాది గజ్జల వివేకానంద డ్రగ్స్ కి బానిస అయినట్లుగా అబ్బాస్ విచారణలో బయటపెట్టినట్లు తెలుస్తోంది. అలాగే రాడిసన్ హోటల్లో వివేక్ తన స్నేహితులు క్రిష్, నిర్భయ్ సింధీతో పార్టీ జరుపుకున్నట్లు వెల్లడించాడు.

మరోవైపు తన చెల్లెలు లిషీ కనిపించడం లేదంటూ హీరోయిన్ కుషిత గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చినప్పటి నుంచి తన చెల్లెలు ఇంటికి రావడం లేదని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణకు హాజరుకావాలని ఆమె కుటుంబసభ్యులకు సూచించారు పోలీసులు. అలాగే డైరెక్టర్ క్రిష్, చరణ్, సందీప్, లిషీ, శ్వేత, నీల్ ఇళ్లకు 160 సీఆర్పీసీ నోటీసులు పంపించారు పోలీసులు. ఈ క్రమంలోనే బెంగళూరులో ఉన్న రఘు చరణ్ అట్లూరి గురువారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో విచారణకు హజరయ్యారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నకిలీ టూత్‌పేస్ట్‌ను చిటికెలో కనిపెట్టే 'స్మార్ట్' టిప్స్ ఇవే!
నకిలీ టూత్‌పేస్ట్‌ను చిటికెలో కనిపెట్టే 'స్మార్ట్' టిప్స్ ఇవే!
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక
శ్రీవారి భక్తులకు హెచ్చరిక! వీఐపీ దర్శనం పేరుతో మోసపోకండి
శ్రీవారి భక్తులకు హెచ్చరిక! వీఐపీ దర్శనం పేరుతో మోసపోకండి
టాస్ గెలిచిన రాజస్థాన్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు..
టాస్ గెలిచిన రాజస్థాన్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు..
ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్