Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Darshan Case: హత్య కేసులో దర్శన్‌కు బెయిల్.. ప్రకాశ్ రాజ్ సంచలన కామెంట్స్.. అలా అనేశాడేంటి?

కన్నడ స్టార్ హీరో దర్శన్‌కు శుక్రవారం (డిసెంబర్ 13) బెయిల్ రావడంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పలువురు సినీ, రాజకీయ సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ దర్శన్ బెయిల్ పై వ్యంగ్యంగా మాట్లాడారు.

Darshan Case: హత్య కేసులో దర్శన్‌కు బెయిల్.. ప్రకాశ్ రాజ్ సంచలన కామెంట్స్.. అలా అనేశాడేంటి?
Darshan, Prakash Raj
Follow us
Basha Shek

|

Updated on: Jan 15, 2025 | 2:08 PM

‘ఛాలెంజింగ్ స్టార్’ దర్శన్‌కు కన్నడో అశేష అభిమానులు ఉన్నారు. శుక్రవారం (డిసెంబర్ 13) ఆయనకు బెయిల్ లభించడంతో ఫ్యాన్స్ తో పాటు పలువురు సినిమా సెలబ్రిటీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంపై మాట్లాడేందుకు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ నిరాకరించారు. దర్శన్‌కు బెయిల్ వచ్చిన తర్వాత దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు ప్రకాష్ రాజ్ చాలా వ్యంగ్యంగా సమాధానం ఇచ్చాడు. నటుడు ప్రకాశ్ రాజ్ శుక్రవారం మైసూరులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమయంలోనే దర్శన్ కు బెయిల్ వచ్చింది. కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రకాష్ రాజ్ కూడా ప్రముఖ నటుడు కావడంతో దీనిపై ఆయన అభిప్రాయాన్ని అడిగారు. కానీ ప్రకాష్ రాజ్ దానికి సమాధానం చెప్పడానికి ఇష్టపడలేదు. ప్రకాష్ రాజ్ శ్రీరంగపట్నంలో ‘నిర్దిగంట’ థియేటర్ నడుపుతున్నాడు. థియేటర్ యాక్టివిటీస్ లో పాల్గొంటున్న చిన్నారుల గురించి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమయంలో ప్రకాష్ రాజ్ దర్శన్ గురించి ఒక ప్రశ్న అడగడంతో వ్యంగ్యంగా మాట్లాడారు. ‘పిల్లల గురించి మాట్లాడేందుకు వచ్చాను. దొంగ నా పిల్లల గురించి కాదు. కేవలం పిల్లల గురించి మాత్రమే మాట్లాడుకుందాం’ అని ప్రకాష్ రాజ్ సెటైరికల్ గా కామెంట్స్ చేశాడు.

పవిత్ర గౌడకు రేణుకాస్వామి అసభ్యకరమైన సందేశాలు పంపాడనే ఆరోపణలున్నాయి. ఈ కారణంగానే దర్శన్, పవిత్ర గౌడ వారి గ్యాంగ్ రేణుకా స్వామిని చిత్రదుర్గ నుంచి బెంగుళూరుకు తీసుకెళ్లి దాడి చేసి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితులందరికీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే దీనిని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో దరఖాస్తు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

దర్శన్ ప్రస్తుతం వెన్నునొప్పితో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయనకు బెయిల్ రావడంతో అభిమానులు పటాకులు పేల్చి మిఠాయిలు పంచి సంబరాలు చేసుకుంటున్నారు. బెయిల్ వచ్చిన వెంటనే పవిత్ర గౌడ కుటుంబ సభ్యులు కూడా హ్యాఫీగా ఫీలవుతున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా  కొన్ని రోజుల క్రితం అనారోగ్య కారణాలతో గతంలో దర్శన్‌కు మధ్యంతర బెయిల్‌ లభించింది. ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ రావడంతో ఆయనకు పెద్ద ఊరట లభించినట్లయింది. ఇక ఇదే హత్య కేసులో ఏ1 పవిత్ర గౌడకు బెయిల్ లభించింది. ఆమె 180 రోజులకు పైగా పరప్ప అగ్రగర జైలులో ఉన్నారు. వీరితో పాటు నాగరాజ్, లక్ష్మణ్, ప్రదోష్, జగదీష్, అనుకుమార్‌లకు కూడా హైకోర్టు కోర్టుబెయిల్ మంజూరు చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి