Rashmika Mandanna: ప్రతీకారం తీర్చుకోవడం అనేది బాధ్యతే.. ఆపరేషన్ సిందూర్ పై రష్మిక పోస్ట్ వైరల్
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఈ అందాల భామ. నేషనల్ క్రష్ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ వయ్యారి. ఇప్పుడు చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉంటుంది.

భారత్,పాకిస్థాన్ మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే.. పాకిస్థాన్ ను చావుదెబ్బ కొట్టింది భారత్. పాక్ దాడికి ప్రతి దాడి చేస్తూ నిన్న రాత్రి విరుచుకుపడింది. భారత్- పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమైన నేపథ్యంలో చాలా మంది సెలబ్రెటీలు సోషల్ మీడియా ద్వారా రకరకాల పోస్ట్ లు షేర్ చేస్తున్నారు. ఇండియా దెబ్బకు పాకిస్థాన్ కనిపించకుండా పోతుందని కొందరు రాసుకొస్తే మరికొందరు.. మా మౌనాన్ని చేతకాని తనం అనుకోవద్దు అంటూ పాక్ కు వార్నింగ్ ఇస్తున్నారు. తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా భారత్- పాకిస్థాన్ యుద్ధం పై సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ ను షేర్ చేసింది.
ఉగ్రవాదం నుంచి మనల్ని రక్షించుకునేందుకు చేస్తున్న పోరాటం యుద్ధం కాదు అని రష్మిక అంటుంది. అలాగే ఈ పోరాటానికి మద్దతిచ్చే వారిని యుద్ధాన్నికోరుకునేవారిగా చెప్పొద్దు. దేశ భద్రత, న్యాయం కోసం ఆరాటపడే పౌరులు వాళ్ళు. దూకుడుగా దాడి చేయడానికి, ఆత్మరక్షణకు మధ్య చాలా భేదం ఉంటుంది. ఉగ్రవాదులు చేసిన కుట్రకు అమాయకులు బలయ్యారు.. దానికి ప్రతీకారం తీర్చుకోవడం అనేది బాధ్యతే అవుతుంది తప్ప.. అవకాశం కాదు. అని రష్మిక రాసుకొచ్చింది.
అలాగే శాంతిని కోరుకోవడమంటే అర్థం.. జరిగిన ప్రాణనష్టాన్ని మౌనంగా ఒప్పుకోవడం కాదు. మనకు జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకుంటున్న దేశాన్ని ప్రశ్నించొద్దు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారిని గట్టిగా ప్రశ్నించండి’ అంటూ రష్మిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ విరుచుకుపడుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.