AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఆర్మీ ఆఫీసర్‌తో పెళ్లి.. సినిమాలు మానేసి జ్యోతిష్యం చెబుతోన్న టాలీవుడ్ హీరోయిన్.. ఎవరంటే?

ముంబైలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ ఫుడ్ సైన్స్, కెమిస్ట్రీలో గ్రాడ్యుయేట్ చేసింది. ఆతర్వాత మోడలింగ్ లోకి అడుగు పెట్టి ఫెమినా మిస్ ఇండియా పోటీలో పాల్గొంది. అటుపై సినిమా ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెట్టింది. తన అందం, అభినయంతో ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది.

Tollywood: ఆర్మీ ఆఫీసర్‌తో పెళ్లి.. సినిమాలు మానేసి జ్యోతిష్యం చెబుతోన్న టాలీవుడ్ హీరోయిన్.. ఎవరంటే?
Bollywood Actress Tulip Joshi
Basha Shek
|

Updated on: Aug 23, 2025 | 7:40 PM

Share

గతంలో సినిమాల్లో నటించి తెరమరుగైన అందాల తారలు ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నారు. సెకెండ్ ఇన్నింగ్స్ అంటూ సహాయక నటి పాత్రల్లో మెరుస్తున్నారు. అయితే గతంలో హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన కొందరు ముద్దుగుమ్మలు ఇప్పుడు బిజినెస్ లో సత్తా చాటుతున్నారు. వివిధ వ్యాపారాలతో కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. ఈ అందాల తార కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం సినిమాల్లో నటించిన ఈ సొగసరి చివరిగా 2015లో ఓ సినిమాలో కనిపించింది. అంతే ఆ తర్వాత మరే మూవీ కానీ, కనీసం సీరియల్స్ లో కానీ కనిపించలేదు. అయితే ఇప్పుడీ బ్యూటీ బిజినెస్ లో దూసుకుపోతోంది. ఒకటి కాదు రెండు కాదు పలు వ్యాపారాలు నిర్వహిస్తూ బిజి బిజీగా ఉంటోంది. ఓ కన్సల్టింగ్ కంపెనీని నడుపుతోన్న ఆమె అస్ట్రాలజర్ కూడా. వేద జ్యోతిషం, లైఫ్ స్టైల్ కన్సల్టేషన్ గురించి సోషల్ మీడియాలో తరచూ వీడియోలు షేర్ చేస్తోంది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరనుకుంటున్నారా? తులిప్ జోషి. తెలుగు ఆడియెన్స్ కు ఈ పేరు పెద్దగా పరిచయం లేకపోవచ్చు.. కానీ.. బాలీవుడ్ లో ఈ బ్యూటీకి మంచి గుర్తింపు ఉంది.

2002లో యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో ‘మేరే యార్ కీ షాదీ హై’ అనే సినిమాతో హీరోయిన్‌గా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది తులిప్ జోషి. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దీని తర్వాత ‘మాతృభూమి’, ‘దిల్ మాంగే మోర్’ తదితర సినిమాల్లో నటించింది కానీ. స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. దీంతో దక్షిణాదిలో అదృష్టం పరీక్షించుకుంది. రాజశేఖర్ నటించిన విలన్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అలాగే రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన కొత్త కొత్తగా అనే మూవీలోనూ ఓ కీలక పాత్ర పోషించింది. అయితే ఈ రెండు సినిమాలు పెద్దగా ఆడలేదు. దీంతో ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది. సల్మాన్ 2014లో హీరోగా నటించిన జయహో అనే సినిమాలో చివరిగా కనిపించింది తులిప్ జోషి.

ఇవి కూడా చదవండి

తులిప్ జోషి లేటెస్ట్ ఫొటోస్..

View this post on Instagram

A post shared by Tulip Joshi (@tulipkjoshi)

తులిప్ జోషి వినోద్ నాయర్ అనే ఒక ఆర్మీ ఆఫీసర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 1989 నుంచి 1996 వరకు పంజాబ్ రెజిమెంట్‌లో కమీషన్డ్ ఆఫీసర్‌గా వినోద్ నాయర్ సేవలు అందించారు. ఇక సినిమాలకు దూరమైన తులిప్ జోషి బిజినెస్ ఉమెన్‌గా మారింది. తన భర్త వినోద్ నాయర్‌తో కలిసి ‘కిమ్మయా కన్సల్టింగ్’ అనే ఒక కంపెనీని నడుపుతోంది. దీంతో పాటు పలు బిజినెస్ లు చేస్తూ బిజీ బిజీగా ఉంటోందీ అందాల తార.

విలన్ సినిమాలో రాజశేఖర్, తులిప్ జోషి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చెక్ బౌన్స్‌ కేసు నిజంగా జైలు శిక్షకు దారితీస్తుందా? రూల్స్ ఏంటి?
చెక్ బౌన్స్‌ కేసు నిజంగా జైలు శిక్షకు దారితీస్తుందా? రూల్స్ ఏంటి?
జోరు వానలో తడిచిన వాళ్ళు ఇవి రెండు గారెలు తింటే నీరసం పోయి..
జోరు వానలో తడిచిన వాళ్ళు ఇవి రెండు గారెలు తింటే నీరసం పోయి..
తల్లిదండ్రులు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన విషయం ఇది..
తల్లిదండ్రులు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన విషయం ఇది..
దుమ్మురేపిన తిలక్ సేన.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే..?
దుమ్మురేపిన తిలక్ సేన.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే..?
'సమరసింహారెడ్డి'లోని ఆ డైలాగులు పరిటాల రవి మాటలే: పరుచూరి
'సమరసింహారెడ్డి'లోని ఆ డైలాగులు పరిటాల రవి మాటలే: పరుచూరి
ఉదయాన్నే నీళ్లు ఎప్పుడు తాగాలి? బ్రష్ చేయడానికి ముందా.. తర్వాతనా?
ఉదయాన్నే నీళ్లు ఎప్పుడు తాగాలి? బ్రష్ చేయడానికి ముందా.. తర్వాతనా?
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..
వర్షాకాలంలో గొంతు నొప్పి బాధలు.. గరగరను చిటికెలో తగ్గించే..
వర్షాకాలంలో గొంతు నొప్పి బాధలు.. గరగరను చిటికెలో తగ్గించే..
భారీగా దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో ఎంత?
భారీగా దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో ఎంత?
వండే ముందు రొయ్యలు ఇలా క్లీన్ చేయకపోతే రుచి మొత్తం పోతుంది..
వండే ముందు రొయ్యలు ఇలా క్లీన్ చేయకపోతే రుచి మొత్తం పోతుంది..