Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saaho director Sujeeth: మెగాస్టార్‌ను మిస్ చేసుకున్న సుజిత్.. ధ‌నుష్‌తో దుమ్ము రేపుతాడా..?

ఫైనల్‌గా సాహో డైరెక్టర్‌ సుజిత్ ఓ మూవీకి కమిట్ అయ్యారు. సెట్స్ మీదకు వెళ్లడానికి కాస్త టైమ్ పట్టే ప్రాజెక్టే అయినా... సాహో తరువాత పర్ఫెక్ట్ చాయిస్ అనే రేంజ్ సినిమానే ఓకే చేశారు

Saaho director Sujeeth: మెగాస్టార్‌ను మిస్ చేసుకున్న సుజిత్.. ధ‌నుష్‌తో దుమ్ము రేపుతాడా..?
sujeeth
Follow us
Ram Naramaneni

| Edited By: Shiva Prajapati

Updated on: Jun 27, 2021 | 8:37 PM

ఫైనల్‌గా సాహో డైరెక్టర్‌ సుజిత్ ఓ మూవీకి కమిట్ అయ్యారు. సెట్స్ మీదకు వెళ్లడానికి కాస్త టైమ్ పట్టే ప్రాజెక్టే అయినా… సాహో తరువాత పర్ఫెక్ట్ చాయిస్ అనే రేంజ్ సినిమానే ఓకే చేశారు ఈ యంగ్ డైరెక్టర్‌. ఓ గ్లోబల్ స్టార్‌తో పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారు. ఆ స్టార్ మరెవరో కాదు… మోస్ట్ టాలెంటెడ్ కోలీవుడ్ హీరో ధనుష్‌. సాహో తరువాత ఓ మెగా ప్రాజెక్ట్ సుజిత్ చేతికి వచ్చినట్టే వచ్చి మిస్ అయ్యింది. చిరంజీవి హీరోగా తెరకెక్కబోయే లూసీఫర్ రీమేక్‌కు డైరెక్టర్‌గా ఫస్ట్ అనుకున్నది సుజిత్‌నే. కథ విషయంలో చాలా కాలం వర్క్ చేసిన ఈ యంగ్ డైరెక్టర్‌.. పర్సనల్ రీజన్స్‌ తో ఈ బిగ్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. సాహో సినిమాతో పాన్ ఇండియా లెవల్‌లో బజ్ క్రియేట్ చేసిన సుజిత్.. నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను కూడా అదే లెవల్‌లో ప్లాన్ చేస్తున్నారు.

అందుకే సౌత్‌ నార్త్‌లలో బిజీగా ఉన్న ధనుష్‌తో ఓ సినిమాకు రెడీ అవుతున్నారు. టాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్‌ హౌస్‌ సితార ఎంటర్‌టైన్మెంట్స్ ఈ క్రేజీ కాంబినేషన్‌ను సెట్ చేస్తుందట. ప్రస్తుతానికి అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ లేకపోయినా… సుజిత్ స్టైలిష్ టేకింగ్‌కు ధనుష్‌ మాస్‌ యాడ్‌ అయితే… సినిమా బ్లాక్ బస్టరే అంటున్నారు సినీ జనాలు. బాహుబ‌లి ప్రభాస్ ఇచ్చిన ఆఫ‌ర్‌ను స‌రిగ్గా వినియోగించుకోలేక పోయిన సుజిత్.. ధ‌నుష్ ఇచ్చిన క్రేజీ ఛాన్స్ ను ఎంత‌మేర యుటిలైజ్ చేసుకుంటాడో చూడాలి.

Also Read: ఫ్యాన్‌ ఫాలోయింగ్ విషయంలో జట్‌ స్పీడుతో దూసుకుపోతున్న రష్మిక

సోష‌ల్ మీడియాలో డార్లింగ్ న్యూ లుక్ వైర‌ల్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్