AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: అతనికి ఎలుకల మందు పెట్టి చంపేస్తా.. షకీలా షాకింగ్ కామెంట్స్

హౌస్ లోకి వెళ్లిన వారిలో కిరణ్ రాథోడ్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. బయటకు వస్తూనే కొంతమంది పై పాజిటివ్ కామెంట్స్ చేసింది. అలాగే మరికొంతమంది పై నెగిటివ్ కామెంట్స్ కూడా చేసింది. పల్లవి ప్రశాంత్ , రతిక పై సంచలన కామెంట్స్ చేసింది. ఇద్దరు ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారని చెప్పింది కిరణ్. అలాగే షకీలా, శివాజీ పై ప్రశంసలు కురిపించింది. కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయ్యి వెళ్తున్న సమయంలో షకీలా కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఇలా మొదటి వారం ఎలిమినేషన్ పూర్తయ్యింది.

Bigg Boss 7 Telugu: అతనికి ఎలుకల మందు పెట్టి చంపేస్తా.. షకీలా షాకింగ్ కామెంట్స్
Shakeela
Rajeev Rayala
|

Updated on: Sep 11, 2023 | 12:15 PM

Share

బిగ్ బాస్ హ్యూస్ లో రచ్చ మొదలైంది. మొదటి వారం చాలా రసవత్తరంగా జరిగింది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన 14 మందిలో ఒకరు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారు కూడా. హౌస్ లోకి వెళ్లిన వారిలో కిరణ్ రాథోడ్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. బయటకు వస్తూనే కొంతమంది పై పాజిటివ్ కామెంట్స్ చేసింది. అలాగే మరికొంతమంది పై నెగిటివ్ కామెంట్స్ కూడా చేసింది. పల్లవి ప్రశాంత్ , రతిక పై సంచలన కామెంట్స్ చేసింది. ఇద్దరు ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారని చెప్పింది కిరణ్. అలాగే షకీలా, శివాజీ పై ప్రశంసలు కురిపించింది. కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయ్యి వెళ్తున్న సమయంలో షకీలా కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఇలా మొదటి వారం ఎలిమినేషన్ పూర్తయ్యింది.

ఇక ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో నాగార్జున హౌస్ లో ఉన్న వారితో ఆటలాడించి సందడి చేశారు. ఒకొక్కరిని హౌస్ లో ఈ వారం జరిగిన వాటిలో ఏది గుర్తుంచుకోవాలనుకుంటున్నారు. ఏది మరిచిపోలవనుకుంటున్నారు అనేది చెప్పమన్నాడు. దాంతో ఒక్కొక్కరు తమకు మంచి మెమొరీని అలాగే మర్చిపోవాలనుకున్న సంఘటనలు గురించి తెలిపారు.

టేస్టీ తేజ మాట్లాడుతూ.. శివాజీ చెప్పడంతో షకీలా హౌస్ లో ఉన్నవారిని భయపెట్టిన విషయం తెలిసిందే. దేయ్యం పెట్టినట్టుగా నటించి అందరిని భయపెట్టింది. అదే సమయంలో నేను ఆమె పక్కనే ఉన్నాను. ఆ రోజు చాలా భయపడ్డాను. దాన్ని నేను మరిచిపోవాలని అనుకుంటున్నా అని తెలిపాడు.

దాంతో షకీలా హౌస్ లో చాలా ఎలుకలు ఉన్నాయి మీరు పరిమిషన్ ఇస్తే ఎలుకల మందు పెట్టి అన్నింటిని చంపేస్తా అలాగే తేజకు కూడా ఎలుకల మందు కలిపి పెడతా.. నీకు అన్నం పెట్టేది నేనే గుర్తుపెట్టుకో అని చెప్పింది. దాంతో నాగార్జునతో సహా అందరూ షాక్ అయ్యి ఆ తర్వాత నవ్వుకున్నారు. అయితే ఆ రోజు శివాజీ టాస్క్ ఇచ్చారని అందుకే అలా చేసి అందరిని భయపెట్టాను అని నవ్వుతు తెలిపారు షకీలా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.