Rajinikanth: ‘నేను ఏసీ వ్యాన్‌లో నిద్రపోతే.. రజనీ నేలపై పడుకున్నారు’.. సూపర్ స్టార్‌పై అమితాబ్ ప్రశంసలు

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాల్లో ఎంత స్టైల్ గా కనిపిస్తారో బయట అంతే సింపుల్ గా కనిపిస్తారు. భారత దేశంలో అత్యధిక పారితోషకం తీసుకునే నటుల్లో ఒకరైన రజనీ నిజ జీవితంలో చాలా సామాన్యుడిలా జీవిస్తారు. సాధారణ దుస్తులు ధరిస్తారు. మారువేషం దాచుకుని, బస్సులు, పార్కుల్లో తిరుగుతూ వార్తల్లో కనిపిస్తుంటారు.

Rajinikanth: 'నేను ఏసీ వ్యాన్‌లో నిద్రపోతే.. రజనీ నేలపై పడుకున్నారు'.. సూపర్ స్టార్‌పై అమితాబ్ ప్రశంసలు
Amitabh Bachchan, Rajinikanth
Follow us

|

Updated on: Sep 22, 2024 | 5:40 PM

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాల్లో ఎంత స్టైల్ గా కనిపిస్తారో బయట అంతే సింపుల్ గా కనిపిస్తారు. భారత దేశంలో అత్యధిక పారితోషకం తీసుకునే నటుల్లో ఒకరైన రజనీ నిజ జీవితంలో చాలా సామాన్యుడిలా జీవిస్తారు. సాధారణ దుస్తులు ధరిస్తారు. మారువేషం దాచుకుని, బస్సులు, పార్కుల్లో తిరుగుతూ వార్తల్లో కనిపిస్తుంటారు. రజనీకాంత్ సింప్లిసిటీ గురించి ఇప్పటికే అనేక కథనాలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు ప్రముఖ నటుడు, లెజెండ్ అమితాబ్ బచ్చన్ తాను చూసిన రజనీకాంత్ సింప్లిసిటీ గురించి గుర్తు చేసుకున్నాడు. స్టార్ డమ్ వచ్చిన తొలినాళ్లలో రజనీకాంత్ తమిళంలోనే కాకుండా కన్నడ, తెలుగు, కొన్ని హిందీ సినిమాల్లో కూడా నటించారు. అయితే కొన్ని దశాబ్దాల క్రితం రజనీకాంత్ తనతో కలిసి హిందీ సినిమాల్లో నటించినప్పుడు ఎలా ఉండేవారో అమితాబ్ బచ్చన్ వివరించారు. రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కలిసి నటించిన చిత్రం ‘వెట్టేయన్’. దాదాపు 33 ఏళ్ల తర్వాత ఈ దిగ్గజ నటులు మళ్లీ కలిసి నటిస్తున్నారు. ఇటీవలే ‘వెట్టేయన్‌’ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానకి అమితాబ్ బచ్చన్ హాజరుకాలేదు కానీ తన వాయిస్ నోట్ పంపారు. ఇది షోలో ప్లే చేవారు.. రజనీకాంత్ గురించి బచ్చన్ మాట్లాడుతూ..

ఇవి కూడా చదవండి

‘హమ్’ సినిమా షూటింగ్ చేయాల్సి వచ్చినప్పుడు రజనీకాంత్ విరామ సమయంలో నేలపై పడుకునేవారు. నేను మాత్రం నా ఏసీ వాహనంలో పడుకునేవాడిని. అయితే రజనీకాంత్ నేలపై పడుకోవడం చూసి నేను ఏసీ వాహనం నుంచి బయటకు వచ్చాను. రజనీకాంత్ స్టార్స్ అందరికంటే సుప్రీమ్ స్టార్’ అని ప్రశంసలు కురిపించారు అమితాబ్. కాగా వెట్టయాన్ అమితాబ్ మొదటి తమిళ సినిమా. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 10న సినిమా విడుదల కానుంది. సినిమాలో రజనీకాంత్ పోలీస్ పాత్రలో నటిస్తే, బచ్చన్ లాయర్ పాత్రలో నటించారు. ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, కన్నడ కిషోర్, రావు రమేష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

33 ఏళ్ల తర్వాత మళ్లీ ఇద్దరూ ఒకే సినిమాలో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.