AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: 27 ఏళ్ల తర్వాత కలిసిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’.. ట్రెండింగ్‌లో పవన్- సుప్రియల ఫొటో

పవన్ ను కలిసిన టాలీవుడ్ నిర్మాతల్లో ఆమె కూడా ఒకరు. వీరి ఫొటోలు ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. సుమారు 27 ఏళ్ల క్రితం వీరిద్దరూ ‘అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి’ సినిమాలో హీరో, హీరోయన్లు గా నటించారు. ఈఈ సినిమాతోనే పవన్, సుప్రియ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ సినిమా తర్వాత పవన్ కల్యాణ్ పవర్ స్టార్ గా మారిపోయారు. అయితే సుప్రియ మాత్రం సినిమాలకు దూరమైంది.

Pawan Kalyan: 27 ఏళ్ల తర్వాత కలిసిన 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'.. ట్రెండింగ్‌లో పవన్- సుప్రియల ఫొటో
Supriya yarlagadda, Pawan Kalyan
Basha Shek
|

Updated on: Jun 24, 2024 | 6:57 PM

Share

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను సోమవారం (జూన్ 24) టాలీవుడ్ నిర్మాతలందరూ కలిశారు. సినిమా ఇండస్ట్రీ సమస్యలపై కూలంకశంగా చర్చించారు. పవన్ కల్యాణ్ ను కలిసిన వారిలో అశ్వనీదత్, ఎ.ఎం.రత్నం, సురేష్ బాబు, ఎస్.రాధాకృష్ణ (చినబాబు), దిల్ రాజు, భోగవల్లి ప్రసాద్, డి.వి.వి.దానయ్య , ఎన్.వి.ప్రసాద్, బన్నీ వాసు, నవీన్ ఎర్నేని, నాగవంశీ, టి.జి.విశ్వప్రసాద్, వంశీ కృష్ణ, వై.రవిశంకర్ తదితరులు ఉన్నారు. పవన్, టాలీవుడ్ నిర్మాతల భేటీకి సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరలవుతున్నాయి. అయితే ఒక ఫొటో మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అదే పవన్ కల్యాణ్- నిర్మత యార్లగడ్డ సుప్రిత కలిసి దిగిన ఫొటో. పవన్ ను కలిసిన టాలీవుడ్ నిర్మాతల్లో ఆమె కూడా ఒకరు. వీరి ఫొటోలు ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. సుమారు 27 ఏళ్ల క్రితం వీరిద్దరూ ‘అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి’ సినిమాలో హీరో, హీరోయన్లు గా నటించారు. ఈఈ సినిమాతోనే పవన్, సుప్రియ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ సినిమా తర్వాత పవన్ కల్యాణ్ పవర్ స్టార్ గా మారిపోయారు. అయితే సుప్రియ మాత్రం సినిమాలకు దూరమైంది. అయితే ఇప్పుడు సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా మంచి అభిరుచిగల సినిమాలు నిర్మిస్తోంది.

మొత్తానికి పవర్ స్టార్ నుంచి డిప్యూటీ సీఎం అయిన పవన్ కల్యాణ్, హీరోయిన్ నుంచి ప్రొడ్యూసర్ అయిన సుప్రియ చాలా ఏళ్ల తర్వాత కలిశారు. ప్రస్తుతం ఈ ఫొటోను పవన్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి 27 ఏళ్ల తర్వాత మళ్లీ కలిశారంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. డిప్యూటీ సీఎంని కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు నిర్మాత అల్లు అరవింద్. టికెట్ల అంశం చాలా చిన్న విషయం. అంతకన్నా పెద్ద సమస్యలు ఉన్నాయి. వాటిపై త్వరలోనే ప్రభుత్వానికి వినతిపత్రం ఇస్తామన్నారు. సినీ ఇండస్ట్రీ తరపున అభినందించేందుకు సీఎం అపాయింట్‌మెంట్ ఇప్పించాలని కోరామన్నారు అల్లు అరవింద్.

ఇవి కూడా చదవండి

పవన్ తో సుప్రియ..

పవన్ తో టాలీవుడ్ నిర్మాతలు.. వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.