AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: ‘విరూపాక్ష’ సెట్‏లో పవన్ కళ్యాణ్ సందడి.. ఇంకేమి అడగలేనంటూ సాయి తేజ్ ఎమోషనల్ పోస్ట్..

కార్తిక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. కొద్ది రోజులుగా ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీక్షించారు. మంగళవారం ఉదయం విరూపాక్ష సెట్‏లో సందడి చేశారు.

Pawan Kalyan: 'విరూపాక్ష' సెట్‏లో పవన్ కళ్యాణ్ సందడి.. ఇంకేమి అడగలేనంటూ సాయి తేజ్ ఎమోషనల్ పోస్ట్..
Pawan Kalyan, Sai Tej
Rajitha Chanti
|

Updated on: Feb 28, 2023 | 12:21 PM

Share

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం విరూపాక్ష. తేజ్ కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న సినిమా ఇది. కార్తిక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. కొద్ది రోజులుగా ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీక్షించారు. మంగళవారం ఉదయం విరూపాక్ష సెట్‏లో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది చిత్రయూనిట్.

అయితే పవర్ స్టార్ విరూపాక్ష సెట్‏లో టీజర్ వీక్షించిన చిత్రాలను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తూ ఎమోషనల్ ట్వీట్ చేశారు సాయి తేజ్. “ఇంకేమి అడగలేను. విరూపాక్ష నాకు చాలా కీలకమైన అడుగు. నా గురూజీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు, మంచి మాటలతో ఇలాంటి క్షణాన్ని ప్రారంభించడం వేడుక. కళ్యాణ్ మామా. మీ ప్రేమకు, ప్రశంసలకు ఎల్లప్పుడూ నా కోసం ఉన్నందుకు థాంక్యూ” అంటూ రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

విరూపాక్ష టీజర్ ను మేకర్స్ మార్చి 1న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో భీమ్లానాయక్ బ్యూటీ సంయుక్త మీనన్ కథానాయికగా నటించింది. ఈ చిత్రానికి అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 21న రిలీజ్ చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.