Coronavirus: కరోనా బారిన పడిన టాలీవుడ్ డైరెక్టర్.. వైరస్ ను సీరియస్ గా తీసుకోవాలంటూ పోస్ట్..

సినిమా ఇండస్ట్రీని కరోనా వెంటాడుతోంది. పలువురు ప్రముఖులు వరుసగా  కరోనా బారినపడుతున్నారు. ఇందులో కొందరు ఇప్పటికే కోలుకోగా.. మరికొందరు ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నారు.

Coronavirus: కరోనా బారిన పడిన టాలీవుడ్ డైరెక్టర్.. వైరస్ ను  సీరియస్ గా తీసుకోవాలంటూ పోస్ట్..
Tharun Bhascker
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 22, 2022 | 9:46 AM

సినిమా ఇండస్ట్రీని కరోనా వెంటాడుతోంది. పలువురు ప్రముఖులు వరుసగా  కరోనా బారినపడుతున్నారు. ఇందులో కొందరు ఇప్పటికే కోలుకోగా.. మరికొందరు ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నారు.  తాజాగా టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌‌కు కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని  అతనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘ హలో ఫ్రెండ్స్ నాకు కొవిడ్ వచ్చింది… ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాను.. ఆ కరోనాను అందరూ సీరియస్‌గా తీసుకోవాలి ఫ్రెండ్స్’  అంటూ  ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో వేదికగా సూచించాడు తరుణ్ భాస్కర్.

 కాగా విజయ్ దేవర కొండ హీరోగా నటించిన  ‘పెళ్లి చూపులు’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు తరుణ్ భాస్కర్.   ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది  అంటూ వరుసగా రెండో హిట్ సొంతం చేసుకున్నాడు. ఇక ‘మీకు మాత్రమే చెప్తా’ మూవీతో ఈ డైరెక్టర్‌‌ హీరోగా కూడా మెప్పించాడు. ఈ సినిమాను టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ నిర్మించాడు. కాగా ప్రస్తుతం అతను ఒకే ఒక జీవితం, ఓ మై కడవులే రీమేక్ కు సంభాషణలు అందిస్తున్నాడు.  వీటితో పాటు  హీరో వెంకటేష్‌తో ఓ సినిమా తీసేందుకు రెడీ అవుతున్నాడీ ట్యాలెంటెడ్ డైరెక్టర్.

Also Read:

IND VS SA: రెండో వన్డేలోనూ చతికిల పడిన టీమిండియా .. సిరీస్ సఫారీల వశం..

TV9 Digital News Round Up : జింక పిల్లను కాపాడిన కుక్క..! | కళ్లకు గంతలు కట్టుకుని నూడల్స్‌ తయారీ.!(వీడియో)

Twitter Video: ట్విట్ట‌ర్‌లో వ‌చ్చే వీడియోలను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలియ‌ట్లేదా.? ఈ స్టెప్స్ ఫాలో అయితే స‌రి..