AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pallavi Prashanth: రైతు బిడ్డ రివేంజ్‌.. వారిపై పరువు నష్టం దావా.. ఆ కంటెస్టెంటే టార్గెట్‌గా లాయర్లతో చర్చలు

బిగ్‌ బాస్‌ గ్రాండ్‌ ఫినాలే అనంతరం అన్న పూర్ణ స్టూడియో ఎదుట పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అభిమానులు పరస్పరం కొట్టుకున్నారు. ఆర్టీసీ బస్సులు కూడా ధ్వంసమయ్యాయి. అలాగే అమర్‌ దీప్‌, అశ్విని శ్రీ, గీతూ రాయల్‌ల కార్లు కూడా ధ్వంసమయ్యాయి. దీంతో పల్లవి ప్రశాంత్, అతని తమ్ముడు, అభిమానులపై కేసులు నమోదయ్యాయి

Pallavi Prashanth: రైతు బిడ్డ రివేంజ్‌.. వారిపై పరువు నష్టం దావా.. ఆ కంటెస్టెంటే టార్గెట్‌గా లాయర్లతో చర్చలు
Pallavi Prashanth
Basha Shek
|

Updated on: Dec 25, 2023 | 7:20 PM

Share

బిగ్‌ బాస్‌ తెలుగు ఏడో సీజన్‌ టైటిల్‌ విజేత పల్లవి ప్రశాంత్‌ రివేంజ్‌కు ప్లాన్‌ చేశాడా? గ్రాండ్‌ ఫినాలే అనంతరం జరిగిన ఘటనలకు సంబంధించి తనను బాధ్యుడిని చేయడంపై కోర్టు మెట్లు ఎక్కనున్నాడా? తనపై అసత్య వార్తలు ప్రసారం చేసిన కొందరు యూట్యూబర్లపై పరువు నష్టం దావా వేయనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.వివరాల్లోకి వెళితే..బిగ్‌ బాస్‌ గ్రాండ్‌ ఫినాలే అనంతరం అన్న పూర్ణ స్టూడియో ఎదుట పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అభిమానులు పరస్పరం కొట్టుకున్నారు. ఆర్టీసీ బస్సులు కూడా ధ్వంసమయ్యాయి. అలాగే అమర్‌ దీప్‌, అశ్విని శ్రీ, గీతూ రాయల్‌ల కార్లు కూడా ధ్వంసమయ్యాయి. దీంతో పల్లవి ప్రశాంత్, అతని తమ్ముడు, అభిమానులపై కేసులు నమోదయ్యాయి. అయితే ఇదే సమయంలో కొన్ని యూట్యూబ్‌ ఛానెల్స్‌ తనపై తప్పుడు ప్రచారం చేశాయని, అందుకే వారిపై పరువు నష్టం దావా కేసులు వేయలనుకుంటున్నాడట పల్లవి ప్రశాంత్‌. ఇందుకోసం తన లాయర్లతో కూడా సంప్రదింపులు జరుపుతున్నాడని టాక్‌ వినిపిస్తోంది.

అసలేం జరిగిందంటే..

బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలే తర్వాత పల్లవి ప్రశాంత్‌ ఇంటర్వ్యూల కోసం చాలా మంది ప్రయత్నించారు. అయితే తన ఊరికొస్తే మాత్రమే ఇంటర్వ్యూలు ఇస్తానని ప్రశాంత్ చెప్పినట్లు కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. కొంత మంది తన ఇంటర్వ్యూ కోసం ప్రశాంత్ ఊరికి వెళ్లగా.. చాలా సేపు వెయింట్‌ చేయించి, ఆ తర్వాత తీరిగ్గా వెళ్లిపొమ్మన్నాడని సోషల్‌ మీడియాలో పోస్టులు షేర్‌ చేశారు. అయితే ఈ విషయంపై రైతు బిడ్డ క్లారిటీ ఇచ్చాడు. తాను బాగా అలసిపోవడం వల్లే యూట్యూబర్లకు ఇంటర్వ్యూలు ఇవ్వలేకపోయానని వీడియోలు కూడా రిలీజ్‌ చేశాడు. అయితే అప్పటికే యూట్యూబర్ల పోస్టులతో పల్లవి ప్రశాంత్‌పై తీవ్రమైన నెగెటివిటీ వచ్చింది. ఈ నేపథ్యంలో తనపై దుష్ప్రచారం చేసిన యూట్యూబర్లపై పరువు నష్టం దావా వేయాలని రైతు బిడ్డ నిర్ణయం తీసుకున్నాడట. ముఖ్యంగా బిగ్‌ బాస్ ఓటీటీ సీజన్‌ కంటెస్టెంట్‌, ప్రముఖ యాంకరే లక్ష్యంగా తన లాయర్లతో ప్రశాంత్‌ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గెట్ టు గెదర్..

బిగ్ బాస్ స్పై బ్యాచ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇలా చేస్తే దెబ్బకు డయాబెటిస్‌ రివర్స్..
ఇలా చేస్తే దెబ్బకు డయాబెటిస్‌ రివర్స్..
రాత్రిపూట అకస్మాత్తుగా మేల్కొంటున్నారా..? ప్రమాదంలో ఉన్నట్లే..
రాత్రిపూట అకస్మాత్తుగా మేల్కొంటున్నారా..? ప్రమాదంలో ఉన్నట్లే..
సెకండ్ హ్యాండ్ బైక్ కొనే ప్లాన్‌లో ఉన్నారా? తక్కువ వడ్డీకే రుణాలు
సెకండ్ హ్యాండ్ బైక్ కొనే ప్లాన్‌లో ఉన్నారా? తక్కువ వడ్డీకే రుణాలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మేనేజర్ పోస్టుల కోసం అప్లై చేయండి
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మేనేజర్ పోస్టుల కోసం అప్లై చేయండి
విరాట్, రోహిత్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
విరాట్, రోహిత్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
విరాట్ కోహ్లీని ఇమిటేట్ చేసిన యూవీ..చూస్తే కడుపుబ్బ నవ్వాల్సిందే
విరాట్ కోహ్లీని ఇమిటేట్ చేసిన యూవీ..చూస్తే కడుపుబ్బ నవ్వాల్సిందే
రైలులో జనరల్ బోగీలు ముందు, వెనుక ఎందుకు ఉంటాయి? అసలు కారణం ఇదే!
రైలులో జనరల్ బోగీలు ముందు, వెనుక ఎందుకు ఉంటాయి? అసలు కారణం ఇదే!
30 ఏళ్ల తర్వాత అకస్మాత్తుగా బరువు పెరిగి అలసటగా అనిపిస్తుందా?
30 ఏళ్ల తర్వాత అకస్మాత్తుగా బరువు పెరిగి అలసటగా అనిపిస్తుందా?
సాంగ్ వచ్చి 31 ఏళ్లు.. ఇప్పటికీ అదే ఫీల్
సాంగ్ వచ్చి 31 ఏళ్లు.. ఇప్పటికీ అదే ఫీల్
లండన్, ప్యారీస్ కాదు.. 2026లో ప్రపంచ పర్యాటకుల తొలి ఎంపిక ఏదంటే?
లండన్, ప్యారీస్ కాదు.. 2026లో ప్రపంచ పర్యాటకుల తొలి ఎంపిక ఏదంటే?