AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virata Parvam: ఓటీటీలోకి వచ్చేస్తోన్న విరాటపర్వం.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..

జూన్ 17న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. వేణు ఉడుగుల దర్శకత్వం.. రానా, సాయి పల్లవిల సహజ నటనకు తెలుగు ప్రేక్షకులు ముగ్దులయ్యారు.

Virata Parvam: ఓటీటీలోకి వచ్చేస్తోన్న విరాటపర్వం.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..
Virata Parvam
Rajitha Chanti
|

Updated on: Jun 29, 2022 | 5:59 PM

Share

న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi), పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి జంటగా నటించిన లేటేస్ట్ చిత్రం విరాటపర్వం (Virata Parvam). 1990లో జరిగిన యాదార్థ సంఘటనల ఆధారంగా నక్సలిజం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ వేణు ఉడుగుల. జూన్ 17న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. వేణు ఉడుగుల దర్శకత్వం.. రానా, సాయి పల్లవిల సహజ నటనకు తెలుగు ప్రేక్షకులు ముగ్దులయ్యారు. ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది..

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ విరాటపర్వం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం భాషలలో జూలై 1న స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, ఎల్ఎస్వీ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించగా.. ఈశ్వరీ, నివేదా పేతురాజ్, ప్రియమణి, నవీన్ చంద్ర కీలకపాత్రలలో నటించారు. తెలంగాణలో 1990లో జరిగిన సరళ అనే ఓ మహిళ మరణం తనను తీవ్రంగా కలచి వేసిందని.. ఆమె జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు డైరెక్టర్ వేణు ఉడుగుల చెప్పారు. విప్లవానికి ప్రేమకథను జోడించి అందమైన ప్రేమకావ్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు వేణు ఉడుగుల.

ఇవి కూడా చదవండి

ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.