AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీ ప్రజలకు అద్దిరిపోయే న్యూస్.. ఇకపై విడుదల రోజే ఓటీటీలో సినిమా చూసే ఛాన్స్.. ఎలాగంటే..!

ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక.. యావత్ ప్రపంచమే కుగ్రామంలా మారిపోయింది. ప్రపంచంలోని మారుమూల ప్రాంతంలో సైతం ఏం జరిగినా.. ప్రపంచానికి ఇట్టే తెలిసిపోతుంది. ఇంటర్నెట్ మాదిరిగానే.. ఓటీటీలు కూడా సంచలనం క్రియేట్ చేశాయి. ఇంతకు ముందు సినిమా విడుదలైతే థియేటర్లో చూడాల్సి ఉండేది.

Andhra Pradesh: ఏపీ ప్రజలకు అద్దిరిపోయే న్యూస్.. ఇకపై విడుదల రోజే ఓటీటీలో సినిమా చూసే ఛాన్స్.. ఎలాగంటే..!
Apsfl Ott Movies
Shiva Prajapati
|

Updated on: Apr 07, 2023 | 8:22 AM

Share

ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక.. యావత్ ప్రపంచమే కుగ్రామంలా మారిపోయింది. ప్రపంచంలోని మారుమూల ప్రాంతంలో సైతం ఏం జరిగినా.. ప్రపంచానికి ఇట్టే తెలిసిపోతుంది. ఇంటర్నెట్ మాదిరిగానే.. ఓటీటీలు కూడా సంచలనం క్రియేట్ చేశాయి. ఇంతకు ముందు సినిమా విడుదలైతే థియేటర్లో చూడాల్సి ఉండేది. లేదంటే.. టీవీలో వచ్చేంత వరకు ఎదురు చూడాల్సి ఉండేది. కానీ, ఓటీటీలు వచ్చాక పరిస్థితి మారిపోయింది. థియేటర్‌లో విడుదలైన కొద్ది రోజులకే ఆ సినిమా ఓటీటీ ప్లాట్‌పామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. దాంతో అభిమానులు.. తమకు నచ్చిన సినిమాను ఇంట్లోనే కూర్చొని కుటుంబ సభ్యులతో కలిసి మరీ చూసేస్తున్నారు.

అయితో ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా సినిమా విడుదలైన రోజునే.. ఏపీ ఫైబర్ నెట్‌లో కొత్త సినిమాను వీక్షించే అవకాశం కల్పిస్తోంది సర్కార్. ఈ కార్యక్రమాన్ని ప్రసాద్ ల్యాబ్స్ వేదికగా ఏప్రిల్ 7వ తేదీన లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్(APSFL)లో ఓటీటీ ప్లాట్‌ఫామ్ సర్వీసెస్‌ సబ్‌స్క్రైబ్ చేసుకుని ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే వెసులుబాటు ఇప్పటికే కల్పించింది. కాగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పునూరు గౌతంరెడ్డి, ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడు అలీ, సినీ నిర్మాత సి కళ్యాణ్, ఇతర ప్రముఖులు, ప్రభుత్వ అధికారులు హాజరు కానున్నారు.

కాగా, ఏపీ ఫైబర్ నెట్ డిజిటల్ సాధికారత ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలను మార్చడం, నెట్‌వర్క్ మౌలిక సదుపాయాలను వివక్షత లేని ప్రాతిపదికన అందుబాటులో ఉండే ‘ట్రిపుల్ ప్లే’ సేవలైన IPTV, ఇంటర్నెట్, టెలిఫోన్ లను అందించడం లక్ష్యంగా సేవలు అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. APSFL ద్వారా గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌లో సురక్షితమైన, అధిక నాణ్యత గల కనెక్టివిటీని అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం APSFL సేవలను మారుమూల ప్రాంతాలకు సైతం విస్తరించి అత్యధిక స్పీడ్‌తో ఇంటర్నెట్ సేవలు అందిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
ముగ్గురు సీఎంలతో నటించిన ఏకైక హీరోయిన్.. ఆమె ఒకప్పుడు..
ముగ్గురు సీఎంలతో నటించిన ఏకైక హీరోయిన్.. ఆమె ఒకప్పుడు..
ఫిబ్రవరి 29న మొదలైన ‘గమ్యం’ మ్యాజిక్‌కు 18 ఏళ్లు
ఫిబ్రవరి 29న మొదలైన ‘గమ్యం’ మ్యాజిక్‌కు 18 ఏళ్లు
ఆశీర్వాదం కుడి చేతితోనే ఎందుకు ఇవ్వాలి..? ఈ విషయాలు తెలిస్తే..
ఆశీర్వాదం కుడి చేతితోనే ఎందుకు ఇవ్వాలి..? ఈ విషయాలు తెలిస్తే..
వేసవి కాలంలో చెరుకురసం తాగడం మంచిదేనా?
వేసవి కాలంలో చెరుకురసం తాగడం మంచిదేనా?
తమిళపార్టీల తొక్కిసలాట.. పిచ్చెక్కిస్తున్న దళపతుల కొట్లాట!
తమిళపార్టీల తొక్కిసలాట.. పిచ్చెక్కిస్తున్న దళపతుల కొట్లాట!
అక్కడ కరెంట్, వైఫ్ ఉండదు.. గొర్రెలు, బర్రెలను ఫ్రీగా ఇస్తారు..
అక్కడ కరెంట్, వైఫ్ ఉండదు.. గొర్రెలు, బర్రెలను ఫ్రీగా ఇస్తారు..
విశ్వక్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్..బాక్సాఫీస్ సెన్సేషన్‌కు ఆరేళ్లు
విశ్వక్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్..బాక్సాఫీస్ సెన్సేషన్‌కు ఆరేళ్లు
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?