డ్రగ్స్‌ కేసులో జైలు నుంచి విడుదలైన నటి ‘సర్ఫ్‌తో తల స్నానం చేశా.. టాయిలెట్‌ వాటర్‌తో చేసిన కాఫీ తాగా..’

డ్రగ్స్ కేసులో అరెస్టైన బాలీవుడ్ నటి క్రిసాన్ పెరీరా (27) జైలు నుంచి విడుదలయ్యారు. డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న నటి పెరీరాను పోలీసులు ఈ నెల 1న షార్జాలో అరెస్టు చేశారు. 26 రోజుల రిమాండ్‌ అనంతరం బుధవారం (ఏప్రిల్ 26) సాయంత్రం పెరీరా జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా తన జైలు జీవితం గురించి వివరిస్తూ బాధ పడ్డారు..

డ్రగ్స్‌ కేసులో జైలు నుంచి విడుదలైన నటి 'సర్ఫ్‌తో తల స్నానం చేశా.. టాయిలెట్‌ వాటర్‌తో చేసిన కాఫీ తాగా..'
Chrisann Pereira Drug Case
Follow us

|

Updated on: Apr 30, 2023 | 6:31 AM

డ్రగ్స్ కేసులో అరెస్టైన బాలీవుడ్ నటి క్రిసాన్ పెరీరా (27) జైలు నుంచి విడుదలయ్యారు. డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న నటి పెరీరాను పోలీసులు ఈ నెల 1న షార్జాలో అరెస్టు చేశారు. 26 రోజుల రిమాండ్‌ అనంతరం బుధవారం (ఏప్రిల్ 26) సాయంత్రం పెరీరా జైలు నుంచి విడుదలయ్యారు.  సోషల్‌ మీడియా వేదికగా తన జైలు జీవితం గురించి వివరిస్తూ నటి బాధ పడ్డారు.

‘డియర్ వారియర్స్.. శత్రువులకు కూడా జైలు గతి పట్టాలని కోరుకోకూడదు. నేను జైలులో ఉన్న ఈ 26 రోజులు నరకం అనుభవించాను. చుట్టూ తెలియని వాళ్లు.. నాలుగు గోడల మధ్య ఎలా గడిపానో నాకే తెలుసు. నాకు పెన్, పేపర్ దొరకడానికే మూడు వారాలు పట్టింది. టైడ్ సర్ప్‌తో తల స్నానం చేశాను. టాయిలెట్ వాటర్‌తో చేసిన కాఫీ తాగానంటూ’ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఐతే పథకం ప్రకారమే పెరీరాను ఈ కేసులో ఇరికించారని, దీనివెనుక పెద్ద కుట్ర జరిగిందని ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగానే అసలు నిందితులు ఆంథోనీ పాల్‌, అతని సన్నిహితుడు రాజేష్‌ బబొటేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్‌ పోర్టుకు వెళ్తుండగా పెరీరాకు పాల్‌ డ్రగ్స్‌ దాచిన ట్రోఫీని నటికి అందించారు. అనంతరం అధికారుల తనిఖీల్లో ట్రోఫీలో డ్రగ్స్‌ బయటపడటంతో నటిని అరెస్టు చేశారు. ఇదే తరహాల్లో మరో నలుగురిని కూడా నిందితుడు పాల్‌ డ్రగ్స్‌ కేసులో ఇరికించేందుకు యత్నించినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. కాగా క్రిసాన్ పెరీరా సడక్‌ 2, బట్లా హౌస్‌ వంటి పలు బాలీవుడ్‌ మువీలో నటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.