AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై సినిమా.. టైటిల్ రిజిస్ట్రేషన్ కోసం నిర్మాతలు పోటా పోటీ

పహల్గామ్‌లో ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్‌లోకి ప్రవేశించి ఉగ్ర స్థావరాలను ధ్వసం చేసింది. ఏకకాలంలో అనేక ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ భయంతో ఉంది. ఈ వైమానిక దాడికి 'ఆపరేషన్ సింధూర్' అని పేరు పెట్టారు. ఓ వైపు ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ వ్యాప్తంగా వార్తలు వినిపిస్తుంటే.. మరోవైపు 'ఆపరేషన్ సిందూర్' పై సినిమా తీయడానికి సన్నాహాలు కూడా ప్రారంభమయ్యాయి.

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై సినిమా.. టైటిల్ రిజిస్ట్రేషన్ కోసం నిర్మాతలు పోటా పోటీ
Operation Sindoor
Follow us
Surya Kala

|

Updated on: May 08, 2025 | 4:14 PM

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారతదేశం పాకిస్తాన్‌లోకి ప్రవేశించింది. మే 6 రాత్రి భారత సైన్యం పాకిస్తాన్ , పీఓకేలోని అనేక ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న సంస్థలను నేల మట్టం చేసింది. దీంతో పాకిస్తాన్ చాలా భయపడుతోంది, ఆ తర్వాత ఆ దేశ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ భరత్ పై పలు ఆరోపణలు చేశారు. భారతదేశంపై తాము దాడులు చేస్తాం అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు కూడా. అయితే ఈ రోజు అంటే భారత వైమానిక దాడి జరిగిన ఒక రోజు తర్వాత.. ఆపరేషన్ సిందూర్ పై సినిమా తీయడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ‘ఆపరేషన్ సింధూర’ సినిమా టైటిల్ రిజిస్టర్ చేయడానికి నిర్మాతల మధ్య పోటీ జరుగుతోంది.

ఈ రేసులో ఏ చిత్రనిర్మాతలు ముందున్నారంటే

ఇటీవల బాలీవుడ్ హంగామాపై ఒక నివేదిక ప్రచురించబడింది. ‘ఆపరేషన్ సింధూర్’ గురించి సమాచారం వెలువడిన వెంటనే వివిధ చిత్ర నిర్మాణ సంస్థలు రంగంలోకి దిగాయి. ఆయన తన ప్రతినిధిని ఆ చిత్ర సంస్థకు పంపి ‘ఆపరేషన్ సింధూర్’ అనే టైటిల్‌ను నమోదు చేశారు. నివేదిక ప్రకారం మహావీర్ జైన్ కంపెనీ ఈ రేసులో ముందంజలో ఉంది. మొదట టైటిల్‌ను నమోదు చేసింది.

అంతేకాదు జీ స్టూడియోస్, టి-సిరీస్ కూడా ఈ పేరుని రిజిస్టర్ చేసుకున్నాయి.వీరు ఈ రేసులో మూడు, నాల్గవ స్థానాల్లో కొనసాగుతున్నారు. ఈ టైటిల్ కోసం ప్రముఖ దర్శకుడు మధుర్ భండార్కర్ కూడా రిజిస్టర్ చేసుకున్నారని కూడా వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

సైనిక కార్యకలాపాలపై చాలా సినిమాలు నిర్మించబడ్డాయి.

బాలీవుడ్ లో ఇప్పటికే అనేక సైనిక కార్యకలాపాలపై సినిమాలు తెరకెక్కాయి. ఇందులో విక్కీ కౌశల్ ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ తో పాటు సన్నీ డియోల్ ‘బోర్డర్’, ‘ఆమ్రాన్’ ,అలియా భట్ ‘రాజీ’ కూడా ఉన్నాయి. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన సినిమాలుగా నిలిచాయి. దీనితో పాటు, ‘లక్ష’, ‘షెషా’, ‘గుంజన్ సక్సేనా: కార్గిల్ గర్ల్’ కూడా ఈ జాబితాలోకి వస్తాయి. ఇప్పుడు చాలా మంది పెద్ద చిత్రనిర్మాతలు ఆపరేషన్ సిందూర్ పై సినిమా తీయడానికి సిద్ధమవుతున్నారు.

అయితే ఈ టైటిల్‌ను ఏ చిత్రనిర్మాతకు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఏ చిత్రనిర్మాత ముందుగా టైటిల్ రిజిస్టర్ చేసుకుంటారో వారు మిగిలిన నిర్మాతలపై పైచేయి సాధిస్తారని నిపుణులు భావిస్తున్నారు. ఈ యుద్ధంలో గెలిచిన చిత్రనిర్మాతకు .. సినిమా పేరే ఒక ఎసెట్ అవుతుంది. మరోవైపు ఈ వైమానిక దాడి తర్వాత సోషల్ మీడియాలో ఈ సినిమా తీయాలని పలువురు నెటిజన్లు తమ కోరికను వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ఈ సినిమాలో చూడాలనుకునే తమకు ఇష్టమైన నటులను ట్యాగ్ చేశారు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..