డిజిటల్ మీడియాలోకి అడుగుపెట్టనున్న అలనాటి హీరోయిన్.. ‘త్రిభంగా’తో రానున్న బాలీవుడ్ భామ..

కరోనా మహమ్మారి ప్రభావంతో థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే. దీంతో పలువురు సెలబ్రెటీలు ఓటీటీ వేదికలను ఎంచుకుంటున్నారు. ఓటీటీలో ప్రసారమవుతున్న వెబ్ సిరీస్‏లు విజయం సాధిస్తుండడంతో

డిజిటల్ మీడియాలోకి అడుగుపెట్టనున్న అలనాటి హీరోయిన్.. 'త్రిభంగా'తో రానున్న బాలీవుడ్ భామ..
Follow us

|

Updated on: Dec 26, 2020 | 3:56 PM

కరోనా మహమ్మారి ప్రభావంతో థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే. దీంతో పలువురు సెలబ్రెటీలు ఓటీటీ వేదికలను ఎంచుకుంటున్నారు. ఓటీటీలో ప్రసారమవుతున్న వెబ్ సిరీస్‏లు విజయం సాధిస్తుండడంతో పలువురు సెలబ్రెటీలు డిజిటల్ మీడియాలోకి ప్రవేశిస్తున్నారు. ఇటీవల తెలుగు హీరోయిన్స్ సమంత, రాశీఖన్నా, హన్సిక ఈ వెబ్ సిరిస్‏లో నటించారు. తాజాగా ఈ జాబితాలోకి మరో హీరోయిన్ వచ్చి చేరింది.

బాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజోల్ తాను నటించిన త్రిభంగాతో నెట్‏ఫ్లిక్స్ ద్వారా డిజిటల్ మీడియాలోకి అరంగేట్రం చేస్తుంది. కాజోల్ భర్త అజయ్ దేవ్‏గణ్ ఆల్కేమీ ఫిల్మ్స్‏తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి రేణుక షహాణే దర్శకత్వం వహించారు. నా తర్వాతి సినిమా త్రిభంగా వచ్చే సంవత్సరం జనవరిలో విడుదలకానుంది. ముగ్గురు స్త్రీలకు చెందిన ఆసక్తికరమైన కథ ఇది. మీ ముందుకు ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్నా అని కాజోల్ తెలిపింది. నిజానికి ఈ సినిమా ఈ ఏడాది జూలైలోనే విడుదలకావాల్సి ఉంది. కానీ కొన్ని కారణల వలన వచ్చే 2021 జనవరిలో విడుదల చేయడానికి నెట్‏ఫ్లిక్స్ వాయిదా వేసింది. అటు ఈ మూవీకి సంబంధించిన పనులన్ని పూర్తయ్యాయి. ఈ సినిమా రిలీజ్ డేట్‏ను చిత్రయూనిట్ ఇంకా ప్రకటించలేదు.