తమ కాలనీ వాసుల కోసం టాలీవుడ్‌ టాప్‌ హీరో నాగార్జున ఏం చేశారో తెలుసా? జూబ్లీహిల్స్ సొసైటీ దగ్గర..

ఎప్పుడు సినిమాలు, షోలతో బిజీగా ఉండే టాలీవుడ్ అగ్ర నటుడు యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున తాజాగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 49 లో

తమ కాలనీ వాసుల కోసం టాలీవుడ్‌ టాప్‌ హీరో నాగార్జున ఏం చేశారో తెలుసా? జూబ్లీహిల్స్ సొసైటీ దగ్గర..
Follow us

|

Updated on: Dec 26, 2020 | 3:50 PM

ఎప్పుడు సినిమాలు, షోలతో బిజీగా ఉండే టాలీవుడ్ అగ్ర నటుడు యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున తాజాగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 49 లో మొక్కలు నాటారు. జూబ్లీహిల్స్ సొసైటీ పార్క్ శంకుస్థాపన చేశారు. తమ కాలనీ పచ్చదనంతో ఉండాలనే సదుద్దేశంతో వాల్గో ఇన్ ఫ్రా MD, CEO శ్రీధర్ రావు గారితో కలిసి మొక్కలు నాటారు.

అనంతరం అక్కడే ఒక చెట్టు కింద కూర్చొని కాసేపు సేద తీరారు. మాస్టర్ అబూ శ్రీని తన ఒడిలో కూర్చోబెట్టుకొని కాసేపు కబుర్లు ఆడారు. ఆ తర్వాత కాలనీ వాసులతో మాట్లాడి చెట్లు పెంచుతున్న వాళ్ల నిర్ణయాన్ని ప్రశంసిస్తూ.. పచ్చదనం కోసం మరిన్ని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మన పరిసరాలను పచ్చదనంతో నింపుకోవడం మన బాధ్యత అంటూ కొనియాడారు. మొన్నటి వరకు బిగ్ బాస్ 4 తో నాగార్జున బిజీగా ఉన్న సంగతి అందరికి తెలిసిందే. ఈ కార్యక్రమం ఇటీవల కంప్లీట్ అవడంతో నాగ్ మళ్లీ తను చేస్తున్న సినిమా షూటింగ్‌లతో పాటు సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొ్ంటున్నారు. కాగా చెట్లు నాటే కార్యక్రమంలో నాగార్జునతో పాటు అతడి స్నేహితుడు సతీష్ రెడ్డి, అశోక్ బాబు, పలువురు కాలనీవాసులు ఉన్నారు.