Telangana: కత్తులతో గొంతులో పొడిచి.. రక్తపు మడుగులో మృతదేహం.. ఆ వ్యవహారమే కారణమా

ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారు. కలిసి జీవితం పంచుకోవాలనుకున్నారు. భవిష్యత్ గురించి ఎన్నో కలలుగన్నారు. కానీ వారి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. వివాహానికి వీల్లేదని చెప్పేశారు. అయినా పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఏమైందో..

Telangana: కత్తులతో గొంతులో పొడిచి.. రక్తపు మడుగులో మృతదేహం.. ఆ వ్యవహారమే కారణమా
Young Man Murder In Suryape
Follow us

|

Updated on: Aug 08, 2022 | 4:07 PM

ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారు. కలిసి జీవితం పంచుకోవాలనుకున్నారు. భవిష్యత్ గురించి ఎన్నో కలలుగన్నారు. కానీ వారి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. వివాహానికి వీల్లేదని చెప్పేశారు. అయినా పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఏమైందో కానీ ఆ యువకుడు హత్యకు గురయ్యాడు. సూర్యాపేట (Suryapet) జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. సూర్యాపేట పట్టణానికి చెందిన కోటయ్య, లక్ష్మీ దంపతుల కుమారుడు దిలీప్ (19).. ఎలక్ట్రికల్ డిప్లొమా రెండో ఏడాది చదువుతున్నాడు. గతంలో పట్టణంలోని తాళ్లగడ్డలో దిలీప్ కుటుంబం నివాసముండేది. ఆ ప్రాంతానికి చెందిన అమ్మాయితో అతనికి పరిచయం ఏర్పడంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. గత కొన్నేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమకు అమ్మాయి సోదరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ సోదరిని ప్రేమించవద్దంటూ దిలీప్ కు వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత దిలీప్ కుటుంబం తాళ్లగడ్డ నుంచి జనగామ క్రాస్ రోడ్డుకు మకాం మార్చింది. అయినా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ కొనసాగుతూనే ఉంది.

ఈ క్రమంలో ఆదివారం రాత్రి 9 గంటలకు బయటకు వెళ్లిన దిలీప్ ఇంటికి రాలేదు. తెల్లవారేసరికి పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ చౌదరి చెరువు కట్టపై విగత జీవిగా మారిపోయాడు. గుర్తుతెలియని వ్యక్తులు దిలీప్ కత్తులతో దాడి చేసి గొంతులో పొడిచి హత్య చేశారు. రక్తపు మడుగులో మృతదేహం పడి ఉంది. తెల్లవారుజామున వాకింగ్ కోసం వచ్చిన స్థానికులు పోలీసులకు సమచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, దిలీప్ కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ప్రేమ వ్యవహారమే తమ కొడుకుని పొట్టన పెట్టుకుందని మృతుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. అమ్మాయిని ప్రేమించిన విషయం తమకు తెలియదని, నిందితులను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

కాగా.. దిలీప్ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. అమ్మాయి పేరెంట్స్ తో గత రాత్రి గొడవ జరిగినట్టు తెలుస్తోంది. దిలీప్ ఓ అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్న నేపధ్యంలో ఆ గొడవ కారణంగానే దిలీప్ హత్యకు గురయ్యాడా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఒకరిని పోలీసులు తీసుకుని విచారిస్తున్నారు. దర్యాప్తును వేగవంతం చేశారు. దిలీప్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!