AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కిలాడీ మోసం.. వాట్సాప్‏లో హాయ్ అని మెసేజ్.. రిప్లై ఇచ్చి లక్షలు పోగొట్టుకున్నాడు.. ఎక్కడంటే..

ఇటీవల సోషల్ మీడియా వినియోగం మరింత పెరిగింది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. అలాగే సోషల్ మీడియా స్నేహాలు

కిలాడీ మోసం.. వాట్సాప్‏లో హాయ్ అని మెసేజ్.. రిప్లై ఇచ్చి లక్షలు పోగొట్టుకున్నాడు.. ఎక్కడంటే..
Whats App
Rajitha Chanti
|

Updated on: Sep 04, 2021 | 8:38 AM

Share

ఇటీవల సోషల్ మీడియా వినియోగం మరింత పెరిగింది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. అలాగే సోషల్ మీడియా స్నేహాలు కూడా శ్రుతిమించుతున్నాయి. అమ్మాయి నుంచి మెసేజ్ వచ్చిందంటే చాలు.. ఆలోచించకుండా ఆమె మాయలో పడిపోతున్నారు. మానసికంగానే కాకుండా.. ఆర్థికంగానూ నష్టపోతున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ సైబర్ మోసాలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఇటీవల సైబర్ మోసాల సంఖ్య ఏ స్థాయిలో నమోదవుతున్నాయో తెలిసిందే. వాట్సప్, ఫేస్‏బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా వల వేసి మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తికి వాట్సప్‏లో హాయ్ అని మెసేజ్ వచ్చింది. దీంతో అతను రిప్లై ఇచ్చాడు. అలా వాళ్లిద్దరి మధ్య పరిచయం పెరిగి.. మాయలేడి ఉచ్చులో పడి ఏకంగా రూ. 23 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.

వివరాల్లోకెలితే.. అనంతరపురం జిల్లాలోని శింగనమల మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి వ్యవసాయం చేసుకుంటున్నాడు. రెండు నెలల క్రితం అతడి మొబైల్‏కు హాయ్ అంటూ మెసేజ్ వచ్చింది. అయితే ఆ నంబర్ అమ్మాయి పేరు మీద ఉండడం.. ప్రొఫైల్ కూడా అమ్మాయి ఫోటోనే ఉండడంతో రిప్లై ఇచ్చాడు. అలా ఇద్దరి మధ్య చాటింగ్ జరిగింది. ఆ తర్వాత క్రమంగా వారి పరిచయం స్నేహంగా మారింది. ఇద్దరూ తరచూ వాట్సాప్ కాల్స్, మెసేజులు చేసుకునేవారు. ఇంతలో ఆ మాయలేడీ నుంచి న్యూడ్ వీడియో కాల్స్ వచ్చాయి. ఇంకేముంది ముందు వెనకా ఆలోచించకుండా.. అతను కాల్స్ మాట్లాడాడు. అయితే ఇక్కడే అసలు కథ అడ్డం తిరిగింది. ఆ వ్యక్తి మాట్లాడిన వీడియోలను రికార్డ్ చేసిన ఆ మాయ లేడీ.. వాటిని సోషల్ మీడియాలో.. బంధువులకు షేర్ చేస్తానని బెదిరించింది. అలా చేయకుండా ఉండాలంటే డబ్బులు పంపాలని డిమాండ్ చేసింది. పరువుపోతుందని భావించిన ఆ వ్యక్తి దాదాపు రూ.23 లక్షల వరకు ఆ అమ్మాయికి పంపించాడు. అయినా ఆ కిలాడీ బెదిరింపులు ఆగలేదు. దీంతో విసిగిపోయిన ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పరిచయం లేని వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప సూచించారు. సైబర్ మోసాల బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్‏లో గానీ.. సైబర్ మిత్ర వాట్సప్ నంబర్ 9121211100కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. అలాగే కేవైసీ వెరిఫికేషన్ పేరుతో బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలను ఎవరైనా అడిగితే చెప్పకూడదని సూచించారు.

Also Read: Traffic Police: అందులో నిజం లేదు.. ఆ వార్తను ఫార్వర్డ్‌ చేసిన వారిపై కఠిన చర్యలు. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ వార్నింగ్‌.

Karthik Deepam: అన్నంత పనీ చేసిన మోనిత! షాక్ లో కార్తీక్..దీప..!

Follow Us
జీరో బ్యాలెన్స్.. ఉచిత సేవలు.. ఐపీపీబీ సరికొత్త విప్లవం
జీరో బ్యాలెన్స్.. ఉచిత సేవలు.. ఐపీపీబీ సరికొత్త విప్లవం
మే 2న అందరి ఫోన్‌లలో సైరన్‌ శబ్దం.. ఎందుకు? కంగారు పడకండి.. అసలు
మే 2న అందరి ఫోన్‌లలో సైరన్‌ శబ్దం.. ఎందుకు? కంగారు పడకండి.. అసలు
కల్తీ మామిడి పండ్ల మాఫియాకు చెక్ పెట్టే యాప్ ఉందని తెలుసా
కల్తీ మామిడి పండ్ల మాఫియాకు చెక్ పెట్టే యాప్ ఉందని తెలుసా
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..