AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: అత్తను గొడ్డలితో నరికిన అల్లుడు.. అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన వృద్ధురాలు

మానవసంబంధాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. విచక్షణ కోల్పోయి, క్షణికావేశంలో సొంతవాళ్లు అని కూడా చూడకుండా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కొన్ని సార్లు హత్యలు చేసేందుకూ వెనుకాడటం లేదు. తాజాగా పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఇలాంటి...

Andhra Pradesh: అత్తను గొడ్డలితో నరికిన అల్లుడు.. అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన వృద్ధురాలు
Crime
Ganesh Mudavath
| Edited By: Ravi Kiran|

Updated on: Jul 18, 2022 | 8:38 PM

Share

మానవసంబంధాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. విచక్షణ కోల్పోయి, క్షణికావేశంలో సొంతవాళ్లు అని కూడా చూడకుండా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కొన్ని సార్లు హత్యలు చేసేందుకూ వెనుకాడటం లేదు. తాజాగా పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఇలాంటి ఘటనే జరిగింది. ఇంట్లో ఉన్న అత్తపై అల్లుడు గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మాచవరం మండలంలోని కొత్తపాలెం గ్రామానికి చెందిన నల్లబోతుల బ్రహ్మంకు గుదె కస్తూరమ్మ కుమార్తె కామేశ్వరితో 30 ఏళ్ల క్రితం వివాహమైంది. అప్పటి నుంచి అల్లుడు నల్లబోతుల బ్రహ్మం, కుమార్తె కామేశ్వరితో కలిసి కస్తూరమ్మ ఇంట్లోనే కలిసి ఉంటున్నారు. కస్తూరమ్మ కుమార్తె కామేశ్వరి హైదరాబాద్ లోని తన కుమారుడి వద్దకు వెళ్లింది.

నాలుగు రోజుల నుంచి కస్తూరమ్మకు అల్లుడు బ్రహ్మం ఇంట్లో ఉంటున్నారు. వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ మొత్తం మీద అల్లుడు గొడ్డలితో కస్తూరమ్మ తల, నుదుటిపై గొడ్డలితో నరికాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతికి గల కారణాలను సేకరిస్తున్నారు. ప్రస్తుతం బ్రహ్మం పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి