AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పునాదుల తవ్వకంలో బిందె లభ్యం.. బంగారు నాణేలతో ఉడాయించిన కూలీలు.. చివరికి ఏమైందంటే..!

మనపాడు గ్రామానికి చెందిన జనార్దన్‌రెడ్డి.. ఇంటి నిర్మాణం కోసం ప్లాన్ చేశాడు. పునాదులు తవ్వేందుకు తొమ్మిది మంది కూలీలను ఏర్పాటు చేశాడు. ఆ కూలీలు పునాదులు తవ్వుతుండగా బంగారు నాణేలు గల..

పునాదుల తవ్వకంలో బిందె లభ్యం.. బంగారు నాణేలతో ఉడాయించిన కూలీలు.. చివరికి ఏమైందంటే..!
Gold
Venkata Chari
|

Updated on: Aug 05, 2021 | 5:18 AM

Share

ఓ ఇంటి నిర్మాణం కోసం కొందరు కూలీలు గుంతలు తవ్వుతున్నారు. ఇంతలో బంగారు నాణేలు ఉన్న బిందె బయటపడింది. బిందెలో దాదాపు 98 బంగారు నాణేలు ఉన్నాయి. వాటిని తీసుకుని తొమ్మిది మంది కూలీలు ఉడాయించారు. కానీ, పోలీసుల చేతికి చిక్కడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఈ సంఘటన జోగులాంబ గద్వాల జిల్లాలోని మనపాడులో చోటుచేసుకుంది. సీఐ వెంకటేశ్లర్లు వివరాల మేరకు.. మనపాడు గ్రామానికి చెందిన జనార్దన్‌రెడ్డి.. ఇంటి నిర్మాణం కోసం పునాదులు తవ్వుతున్నాడు. దీనికోసం తొమ్మిది మంది కూలీలను ఏర్పాటు చేశాడు. ఆ కూలీలు పునాదులు తవ్వుతుండగా బంగారు నాణేలు గల బిందె బయటపడినట్లు పలు పేపర్లలో కథనాలు వచ్చాయి.

దీంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పునాదులు తవ్విన తొమ్మిది మంది కూలీలను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, నిందుతులు పూర్తి వివరాలు పోలీసులకు తెలిపారు. పునాదులు తవ్వుతుండగా బిందె బయటపడిందని, ఆ బిందెలో 98 బంగారు నాణేలు ఉన్నాయని, ఇంటి యజమానికి చెప్పకుండా తామే పంచుకున్నామని కూలీలు ఒప్పుకున్నారు. దీంతో ఆ తొమ్మిది మందిని అరెస్టు చేసి, ఇండియన్ ట్రెజరీ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

కాగా, ఒక్కో బంగారు నాణెం సుమారు 3 గ్రాముల ఉందని పోలీసులు తెలిపారు. అయితే, బంగారు నాణేలను ఈ తొమ్మిది మందిలో కొందరు ఆభరణాలు చేయించుకోగా, మరి కొందరు వాటిని అమ్మి డబ్బు తీసుకున్నారు. కూలీల వద్ద నుంచి 12 తులాల12 గ్రాముల బంగారు ఆభరణాలతోపాటు రూ.4.60లక్షల నగదు స్వాధీనం ఆయన పేర్కొన్నారు. ఈమేరకు నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని ఆయన తెలిపారు.

Police (1)

Also Read: Suspicious death: చీరాల రైల్వే ట్రాక్‌పై యువకుడు అనుమానాస్పద మ‌ృతి.. హత్య చేసి ఉంటారని అనుమానాలు

ఢిల్లీలో ఆ దారుణ ఘటన.. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్ గాంధీ.. బీజేపీ ఎద్దేవా

రాహుల్ గాంధీ తెలిసే తప్పు చేశారు.. కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి