Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: దారుణం.. ఐదేళ్లుగా బాలికపై అత్యాచారం.. తండ్రితో సహా ఎస్పీ, బీఎస్పీ నాయకుల అరెస్ట్..

Uttar Pradesh Crime News: ఉత్తరప్రదేశ్‌లో 17 ఏళ్ల బాలికపై ఐదేళ్లుగా అత్యాచారం చేసిన కేసులో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసులో లలిత్‌పూర్‌ జిల్లా సమాజ్‌వాదీ

Crime News: దారుణం.. ఐదేళ్లుగా బాలికపై అత్యాచారం.. తండ్రితో సహా ఎస్పీ, బీఎస్పీ నాయకుల అరెస్ట్..
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 17, 2021 | 8:18 AM

Uttar Pradesh Crime News: ఉత్తరప్రదేశ్‌లో 17 ఏళ్ల బాలికపై ఐదేళ్లుగా అత్యాచారం చేసిన కేసులో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసులో లలిత్‌పూర్‌ జిల్లా సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధ్యక్షుడు తిలక్‌ యాదవ్, బహుజన సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) దీపక్‌ అహిర్వార్‌ కూడా అరెస్టయినట్లు యూపీ పోలీసులు తెలిపారు. కాగా.. ఈ కేసులో ఇప్పటిదాకా అరెస్టయిన వారి సంఖ్య ఏడుకు చేరిందని జిల్లా ఎస్పీ నిఖిల్‌ పాఠక్‌ శనివారం వెల్లడించారు. తనపై ఐదేళ్లపాటు అత్యాచారం చేశారంటూ బాధితురాలు తండ్రి, మామతో సహా మొత్తం 25 మందిపై ఫిర్యాదు చేసింది. అక్టోబర్‌ 12న పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన యూపీలో సంచలనంగా మారింది. నిందితుల్లో బాలిక తండ్రి, మామ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ కేసులో ఎస్పీ, బీఎస్పీ నాయకుల పేర్లు బయటకు రావడంతో వారంతా పరారీలో ఉన్నారు. ఈ క్రమంలో మీర్జాపూర్‌లోని ఓ హోటల్‌లో ఉన్నట్లు పోలీసులకు సమచారం రావడంతో.. దాడులు నిర్వహించారు. తిలక్‌ యాదవ్, దీపక్‌ అహిర్వార్‌తో పాటు మహేంద్ర దూబే అనే ఇంజనీర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. బాలికపై అత్యాచారం కేసులో తమ పార్టీ నేత అరెస్టు కావడంతో సమాజ్‌వాదీ పార్టీ లలిత్‌పూర్‌ జిల్లా పార్టీ యూనిట్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

Also Read:

Kotia Dispute: ఆంధ్రా -ఒడిషా బోర్డర్‌లో టెన్షన్.. రోజు రోజుకూ హీటెక్కుతున్న కొటియా కొట్లాట..

Road Accident: నిమజ్జనానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం.. పలువురికి..