AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP CRIME NEWS : చిత్తూరు జిల్లాలో అంతర్రాష్ట్ర ఆవు దొంగల ముఠా అరెస్ట్.. 44 ఆవులు, 2 వ్యాన్లు స్వాధీనం..

AP CRIME NEWS : చిత్తూరు జిల్లాలో పోలీసులు అంతర్రాష్ట్ర ఆవు దొంగల ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా జిల్లాలో

AP CRIME NEWS : చిత్తూరు జిల్లాలో అంతర్రాష్ట్ర ఆవు దొంగల ముఠా అరెస్ట్.. 44 ఆవులు, 2 వ్యాన్లు స్వాధీనం..
Inter State Cow Gang
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 12, 2021 | 8:40 AM

Share

AP CRIME NEWS : చిత్తూరు జిల్లాలో పోలీసులు అంతర్రాష్ట్ర ఆవు దొంగల ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా జిల్లాలో ఆవుల అపహరణ పై పోలీసులు నిఘా పెంచారు. కాగా తవణంపల్లి వద్ద కర్ణాటక, హర్యానాకు చెందిన 5 మంది ముఠా సభ్యులు ఆవులను దొంగలించి తమిళనాడుకు తరలిస్తుండగా పట్టుబడ్డారు.

నిందితులను విచారించిన పోలీసులకు ఆశ్చర్యకరమైన నిజాలు తెలిసాయి. గత కొన్ని రోజులుగా చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో ఆవులను దొంగతనం చేసినట్లు ఈ ముఠా సభ్యులు అంగీకరించారు. వీరి దగ్గరి నుంచి 25 లక్షల రూపాయల విలువైన 44 ఆవులు, 2 వ్యాన్లను స్వాదీనం చేసుకున్నారు. ఇందులో కర్ణాటకలోని కోలార్ కు చెందిన సుల్తాన్ షరీఫ్, అమీర్ ఖాన్, సయ్యద్ సుహేల్, నిజాముద్దీన్, హర్యానాకు చెందిన రాజుద్దీన్ లు ఉన్నారు. ఇంకా ఈ ముఠాలో చాలా మంది సభ్యులు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. మిగతావారికోసం కూడా గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉంటే..చిత్తూరు జిల్లాలో ఈ మధ్యకాలంలో ఆవులు, ఎద్దులను దొంగిలిస్తున్న ఘటనలు తరచుగా వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. జిల్లాలోని గంగవరంలో ఆవులు, ఎదులను దొంగిలించారు కొందరు దుండగులు. గాంధీనగర్‌లో 5 ఆవులు, 2 ఎద్దులను దొంగల ముఠా అపహరించుకెళ్లింది. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠా ఈ దోపిడీలకు పాల్పడుతుందని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలోనూ తమిళనాడులోని వేలూరు పరిసర ప్రాంతాల్లో ఇలాంటి చోరీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

L Ramana: ఇవాళ తెలంగాణ భవన్‌కి ఎల్‌. రమణ, మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా టీఆర్ఎస్ సభ్యత్వం

Puri Rath Yatra 2021: అంతా సిద్ధం.. కాసేపట్లో మొదలు కానున్న పూరీ జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర

భూమి మీద బతికుండాలని రాసి పెట్టి ఉంటే…గోదాట్లో దూకిన చావు రాదంటారు !.. ఇప్పుడు అదే జరిగింది

Horoscope Today: ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి.. ఈరోజు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకోండి.

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..