AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అనుమానంతో భార్య హత్య.. అనాధలుగా మిగిలిన చిన్నారులు

అనుమానం పెనుభూతమంటారు.. అదే అనుమానంతో ఎన్నో పచ్చని కాపురాలు కూలిపోతున్నాయి. ఐదేళ్ల కాపురం చేసిన భార్య,భర్తల మధ్య అనుమానం వారిమధ్య దూరాన్ని పెంచింది. దీని ఫలితం ఒకరు ప్రాణాలు కోల్పోగా మరొకరు పరారీలో ఉన్నారు. కామారెడ్డి జిల్లా నస్రూలాబాద్ మండలానికి చెందిన జ్యోతి, నిర్మల్ జిల్లా కడెం గ్రామానికి చెందిన రాజు ఇద్దరూ భార్యభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. సజావుగా సాగుతున్న వీరి కాపురంలో అనుమానం పెను ప్రకంపనలు రేపింది. తన భార్యపై అనుమానం పెంచుకున్న రాజు  […]

అనుమానంతో భార్య హత్య.. అనాధలుగా మిగిలిన చిన్నారులు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 05, 2019 | 5:52 PM

Share

అనుమానం పెనుభూతమంటారు.. అదే అనుమానంతో ఎన్నో పచ్చని కాపురాలు కూలిపోతున్నాయి. ఐదేళ్ల కాపురం చేసిన భార్య,భర్తల మధ్య అనుమానం వారిమధ్య దూరాన్ని పెంచింది. దీని ఫలితం ఒకరు ప్రాణాలు కోల్పోగా మరొకరు పరారీలో ఉన్నారు.

కామారెడ్డి జిల్లా నస్రూలాబాద్ మండలానికి చెందిన జ్యోతి, నిర్మల్ జిల్లా కడెం గ్రామానికి చెందిన రాజు ఇద్దరూ భార్యభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. సజావుగా సాగుతున్న వీరి కాపురంలో అనుమానం పెను ప్రకంపనలు రేపింది. తన భార్యపై అనుమానం పెంచుకున్న రాజు  ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలుపెట్టాడు. ఒకటిరెండుసార్లు పెద్దల్లో కూర్చుని పంచాయతీలు చేసినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో జూలై29న ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆమెను తీవ్రంగా కొట్టడంతో పాటు గొంతు నులిమే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన ఇరుగుపొరుగువారు జ్యోతిని హస్పిటల్‌కు తరలించారు. చివరికి ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది.

ఈ ఘటనపై మృతురాలు జ్యోతి సోదరి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు రాజు పరారీలో ఉండగా తల్లిని పోగొట్టుకుని, తండ్రి కనిపించక చిన్నారులిద్దరూ కన్నీటి పాలవుతున్న దృశ్యం అక్కడున్నవారిని కంటతడి పెట్టిస్తుంది.

ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు