దారి కాసి.. దాడి చేసి.. దోచుకుంటున్న దోపిడీ దొంగలు.. ఆ ఘాట్‌రోడ్డులో తస్మాత్ జాగ్రత్త..

విశాఖ ఏజెన్సీ దారాలమ్మ ఘాట్‌రోడ్డులో మరోసారి దొంగలు బీభత్సం సృష్టించారు. ప్రయాణికులపై దాడి చేసి..నగదుతో పాటు వాహనాన్ని ఎత్తుకెళ్లారు.

దారి కాసి.. దాడి చేసి.. దోచుకుంటున్న దోపిడీ దొంగలు.. ఆ ఘాట్‌రోడ్డులో తస్మాత్ జాగ్రత్త..
attack
Follow us

|

Updated on: Feb 22, 2021 | 9:48 PM

విశాఖ ఏజెన్సీ దారాలమ్మ ఘాట్‌రోడ్డులో మరోసారి దొంగలు బీభత్సం సృష్టించారు. ప్రయాణికులపై దాడి చేసి..నగదుతో పాటు వాహనాన్ని ఎత్తుకెళ్లారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ దాడిపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు.

విశాఖ జిల్లా జీకే వీధి మండలం కమ్మరపల్లి ప్రాంతానికి చెందిన అప్పారావు..అనే గిరిజనుడికి అనారోగ్యం కావడంతో..అతన్ని స్కార్పియోలో వాహనంలో నర్సీపట్నంకు తెల్లవారుజామున తరలిస్తున్నారు. వాహనం దారాలమ్మ ఘాట్‌రోడ్డులో వచ్చే సరికి..ఆగిపోయింది. కార్‌ స్టార్ట్‌ చేసేందుకు ప్రయత్నిస్తుండగానే..ఇంతలో సినీ ఫిక్కీలో అకస్మాత్తుగా దొంగలు వచ్చారు. తుపాకీ, మారణాయుధాలతో బెదిరించి డ్రైవర్‌ దొరబాబుపై దాడి చేశారని బాధితులు వాపోతున్నారు.వారి దగ్గరున్న 20 వేల నగదు, సెల్‌ఫోన్‌తో పాటు వారి వాహనాన్ని కూడా తీసుకుని పారిపోయారు. బాధితులు ఎలాగోలా అవస్థలు పడుతూ విషయం పోలీసులకు చెరవేశారు.

విషయం తెలుసుకున్న జీకే వీధి సీఐ మురళీధర్‌… స్వాట్‌కు చేరుకున్నారు. దారకొండ, సీలేరులోని సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ మధ్య కాలంలో దారాలమ్మ ఘాట్‌రోడ్డులో దొంగలు వరుస దాడులతో ప్రజల్ని హడలెత్తిస్తున్నారు. దారినపోయే వాహనాలను అడ్డుకుని దాడులు, దోపిడీలకు పాల్పడుతున్నారంటూ స్థానిక ప్రజలతో పాటు, వాహనదారులు, ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read:

నల్లగా ఉన్నావ్.. వదిలేసి.. మరొకర్ని పెళ్లి చేసుకుంటానన్న భర్త.. భార్య ఊహించని పని చేసింది

చనిపోయి ఇన్నేళ్లు అవుతున్నా ఆమె మరణం అంతుచిక్కని మిస్టరీనే.. దెయ్యమే చంపిందా..?.. షాకింగ్ వీడియో