AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుట్టింటి నుంచి భార్యను పిలిచాడు.. ఆమె గొడవకు దిగింది.. వాదించలేక ఆ భర్త ఏం చేశాడంటే.!

Crime News Update: తరచూ భార్యతో ఏదొక గొడవ.. ప్రతీ చిన్న విషయానికి పేచీ పెట్టుకుని పుట్టింటికి వెళ్ళుతుంది. ఆమె తీరుతో విసుగు చెందినా..

పుట్టింటి నుంచి భార్యను పిలిచాడు.. ఆమె గొడవకు దిగింది.. వాదించలేక ఆ భర్త ఏం చేశాడంటే.!
Crime News Update
Ravi Kiran
|

Updated on: Mar 15, 2021 | 10:31 PM

Share

Crime News Update: తరచూ భార్యతో ఏదొక గొడవ.. ప్రతీ చిన్న విషయానికి పేచీ పెట్టుకుని పుట్టింటికి వెళ్ళుతుంది. ఆమె తీరుతో విసుగు చెందినా.. ప్రేమగా కలిసి ఉందామని ఆ భర్త భార్యను తన ఇంటికి రమ్మని కోరాడు. ఆమె తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్లీ గొడవకు దిగింది. ఇంక ఆమెతో వాదించలేక ఆగ్రహంతో అతడు ఏకంగా తన నాలుకను కోసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో కాన్పూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

స్థానిక గోపాల్‌పూర్‌కు చెందిన ముఖేష్, నిషా భార్యాభర్తలు. వీరి వైవాహిక జీవితంలో తరుచూ గొడవలే. ఒకానొక సందర్భంలో కుటుంబ విషయమై ముకేష్, నిషా మధ్య గొడవ పెద్దదైంది. దీనితో నిషా కోపంతో తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమె తీరుతో విసుగు చెందినా ముఖేష్ పుట్టింటికి వెళ్లిన భార్యకు.. ఫోన్ చేసి కలిసి ఉందామని ప్రేమగా పిలుస్తాడు. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆమె వినిపించికోకుండా మళ్లీ గొడవకు దిగుతుంది. దీనితో ఆగ్రహించిన ఆ భర్త ఆమెతో వాదించలేక ఏకంగా తన నాలుకను కోసుకున్నాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో అతడిని కుటుంబసభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు.

మరిన్ని ఇక్కడ చదవండి:

తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులు ముఖ్య గమనిక…పలు ట్రైన్స్ దారి మళ్లింపు.. వివరాలివే!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట.. పదవీ విరమణ రోజే పెన్షన్ బెనిఫిట్స్.. వివరాలు ఇవే.!

చుట్టూ భారీ అనకొండలు.. వాటితో ఆటలు.. ఇంతలోనే ఊహించని సంఘటన.. గగుర్పొడిచే వీడియో.!