Crime News: వారి టార్గెట్ బ్యాచిలర్స్.. యువతులతో నగ్న వీడియో కాల్స్.. ఆపై.!

ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వాడకం ఎక్కువైపోవడంతో మోసం చేసేవాళ్లు తెలివి మీరిపోతున్నారు. తమ పంధాను ఎప్పటికప్పుడు...

Crime News: వారి టార్గెట్ బ్యాచిలర్స్.. యువతులతో నగ్న వీడియో కాల్స్.. ఆపై.!
Crime
Follow us

|

Updated on: Oct 28, 2021 | 9:37 AM

ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వాడకం ఎక్కువైపోవడంతో మోసం చేసేవాళ్లు తెలివి మీరిపోతున్నారు. తమ పంధాను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ అమాయకులను ఇట్టే మోసం చేస్తున్నారు. తాజాగా ఓ కిలాడీ జంట ఏకంగా 200 మందిని మోసం చేసి సుమారు రూ. 22 కోట్లను దోచేసుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన స్వప్నా, యోగేశ్ భార్యాభర్తలు. వీరిద్దరూ కూడా కష్టపడకుండా ఈజీ మార్గంలో డబ్బులు సంపాదించాలని ఆశ పడ్డారు. ఆ ఆలోచన వచ్చిందే తడువుగా ఇంటర్నెట్ ద్వారా తమకు పరిచయమైన ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తిని సలహా అడిగారు. నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడుతూ.. వాటిని రికార్డు చేసి బాధితుల నుంచి డబ్బులు లాగొచ్చునని ఆ కేటుగాడు.. వీరికి సలహా ఇచ్చాడు. దీనితో స్వప్నా, యోగేశ్ ఈ దందాలోకి దిగారు.

కొంతమంది యువతులకు వీడియో కాల్స్ ఎలా మాట్లాడాలన్న దానిపై స్వప్న శిక్షణ ఇవ్వగా.. యోగేశ్ వ్యక్తుల వివరాలు సేకరించేవాడు. మొదటిగా ఓ వెబ్‌సైట్ సాయం తీసుకుని ఈ జంట నగ్నంగా వీడియో కాల్స్ చేసేవారు. కాల్ చేయాలంటే ముందుగానే నిమిషానికి రూ. 200పైగా చెల్లించాలని బాధితులకు చెప్పేవారు. ఇలా తమ దందాను షూరూ చేసి ఈ జంట క్రమేపీ డబ్బులు సంపాదించడం మొదలుపెట్టింది. అయితే ఆ తర్వాత ఈ జంట వెబ్‌సైట్‌కు చెల్లించే మొత్తం కంటే తక్కువలోనే వీడియో కాల్స్ చేస్తామంటూ బాధితుల నుంచి ఫోన్ నెంబర్లు సేకరించేవారు. వాట్సాప్ లేదా ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా వీడియో కాల్స్ చేసి అవతల వారు నగ్నంగా మాట్లాడేలా చేసేవారు. తద్వారా ఆ కాల్‌ను రికార్డు చేసి అడిగినంత డబ్బులు ఇవ్వాలంటూ బాధితులను బెదిరించేవారు.

కాగా, గత రెండేళ్లుగా ఈ దందా సాగిస్తూ బాధితుల నుంచి సుమారు రూ. 22 కోట్లను దోచుకున్నారు ఈ కిలాడీ జంట. నగ్నంగా వీడియో కాల్స్ చేసి మాట్లాడే యువతులకు నెలకు రూ. 25 వేలు.. కేవలం మెసేజ్‌లు చేసేవారికి రూ. 15 వేలు జీతాలు చెల్లించేవారు. ఓ కంపెనీకి చెందిన ఉద్యోగి సుమారు రూ. 80 లక్షలు సంస్థ ఖాతా నుంచి మాయం చేయడంతో.. ఆ కంపెనీ యజమాని గుజరాత్‌లోని రాజ్‌కోట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో ఈ జంట దందా వెలుగులోకి వచ్చింది. ఇక ఈ కేసులో భార్యాభర్తలతో సహా మరో ముగ్గురు యువతులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇవి చదవండి:

Viral Video: చెరువులో ఈత కొడుతున్న వ్యక్తి.. అంతలో మొసలి మెరుపు దాడి.. చివర్లో ట్విస్ట్ అదుర్స్.!

Viral: సరదాగా 4 గంటలు పబ్‌లో గడిపారు.. మద్యం సేవించారు.. చివరిగా బిల్లు చూసి నోరెళ్లబెట్టారు!

Garuda Puranam: ఈ 3 అలవాట్లు వెంటనే మానేయాలి.. లేదంటే కష్టాలు తప్పవు.!

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..