AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chittoor District: బొప్పాయి తోటలో బాలుడి హత్య.. గుండెలవిసేలా రోధిస్తోన్న తల్లి

అభం శుభం తెలియని అమాయక బాలుడు. చూడగానే ముద్దు చేయాలనిపించే చిన్న పిల్లవాడు. అలాంటి బాలుడు బొప్పాయి తోటలో శవమై తేలాడు.

Chittoor District: బొప్పాయి తోటలో బాలుడి హత్య.. గుండెలవిసేలా రోధిస్తోన్న తల్లి
Boy Murder
Ram Naramaneni
|

Updated on: Oct 14, 2021 | 3:29 PM

Share

అభం శుభం తెలియని అమాయక బాలుడు. చూడగానే ముద్దు చేయాలనిపించే చిన్న పిల్లవాడు. అలాంటి బాలుడు బొప్పాయి తోటలో శవమై తేలాడు. ఈ హత్యకు కారణమేంటి? ఒక చిన్న పిల్లాడ్ని పట్టుకుని గొంతు పిసికి చంపేంత గొడవలేంటి? ఇదే ప్రస్తుతం పీలేరు ప్రాంతంలో చర్చ. చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన నాగిరెడ్డి, జ్యోతి.. వీరికి ఎనిమిదేళ్ల తేజేష్ అనే కొడుకు. తేజేష్ తల్లిదండ్రులు కుటుంబ పోషణకై కువైట్ వెళ్లి సంపాదించాలనుకున్నారు. ఇందుకు తమ దగ్గర డబ్బు లేక పోవడంతో.. వడ్డీ వ్యాపారులైన రవీంద్రరెడ్డి, భూదేవిరెడ్డి దగ్గర ఐదేళ్ల క్రితం అప్పు చేశారు. ఆ డబ్బుతో కువైట్ వెళ్లారు. అక్కడ సంపాదించిన డబ్బులతో ఇక్కడ అప్పిచ్చిన వాళ్లకు వడ్డీ కడుతూ వచ్చారు. ఇప్పటి వరకూ తాము రెండు లక్షల రూపాయల వరకూ కట్టామనీ.. వడ్డీ కూడా సెటిల్ చేస్తామని చెప్పామనీ.. అయినా సరే వాళ్లు తమపై కక్ష కట్టారనీ.. మా పిల్లాడ్ని కడతేర్చేశారనీ వాపోతుందామె. .ఇలాంటోళ్లను ఉరి తీయాలని డిమాండ్ చేస్తోందా కన్నతల్లి.

ఇక్కడ దారుణమేంటంటే.. ఒకే ఊరు- ఒకే కులం మాత్రమే కాదు.. అప్పు ఇచ్చిన వాళ్లు.. బాధిత కుటుంబానికి బంధువులు కూడా. తల్లి ఆరోపిస్తున్నట్టు ఇందులో వడ్డీ ఇచ్చినోళ్ల తప్పే ఉందా? లేక ఈ కడుపుకోత వెనక మరేదైనా దాగి ఉందా? అన్నది తేలాల్సి ఉంది.  ఏది ఏమైనా.. ఒక అమాయక బాలుడైతే అన్యాయంగా ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు ఆర్ధిక లావాదేవీలే కారణమా? లేక కుటుంబ కక్షలే రీజన్లై ఉంటాయా? ఏం జరిగింది? అన్న ఉత్కంఠ నడుస్తోంది.

కొడుకు మరణ వార్త విన్నవెంటనే తల్లిదండ్రులు కువైట్ నుంచి హుటాహుటిన పీలేరు చేరుకున్నారు. కన్నపేగు బంధం తెగడంతో.. గుండెలవిసేలా ఏడుస్తున్న ఆ తల్లిని చూసి.. చుట్టుపక్కల వాళ్లు కూడా.. రోదిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కాళ్ళ పై పడి వేడుకున్న తల్లి జ్యోతి వేడుకున్న విదానం అక్కడ ఉన్నవారిని కంటతడి పెట్టించింది. ఎన్నో పూజల చేస్తే పుట్టిన ఒకానొక కొడుకును దుర్మార్గులు పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంతకీ ఈ పసివాడి ప్రాణం తీసిన పాపాత్ములెవరు? కుటుంబమా? ఆర్ధికమా? పిల్లాడి ప్రాణం తీసేంత కక్షలూ కార్పణ్యాల కుట్ర కోణమేంటి? అన్నది పోలీసుల విచారణలో తేలనుంది. కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని మదనపల్లి డీఎస్పీ రవి మనోహరా ఆచారి తెలిపారు.

Also Read: బాలయ్య సలహా.. ఇప్పుడు నా అజెండే అదేనన్న మంచు విష్ణు

బ్యాట్స్ మెన్ల బాదుడు..బౌలర్ల ఏడుపు.. ఒకే టీ20 మ్యాచ్లో 449 రన్స్
బ్యాట్స్ మెన్ల బాదుడు..బౌలర్ల ఏడుపు.. ఒకే టీ20 మ్యాచ్లో 449 రన్స్
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?