AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nizamabad: మరో ఘోరం.. నిజామాబాద్ టౌన్‌లో ఇద్దరు బాలికలపై మృగాడి దుర్మార్గం

అమ్మాయిలూ జాగ్రత్త... మీ చుట్టూనే మానవ మృగాలు తిరుగుతున్నాయ్.. ఈ మానవ మృగాలు మీ ఇంట్లోనే ఉండొచ్చు.. లేదా మీ పక్కింట్లో ఉండొచ్చు..

Nizamabad: మరో ఘోరం.. నిజామాబాద్ టౌన్‌లో ఇద్దరు బాలికలపై మృగాడి దుర్మార్గం
Nizamabad
Venkata Narayana
| Edited By: Anil kumar poka|

Updated on: Oct 07, 2021 | 9:34 PM

Share

Nizamabad: అమ్మాయిలూ జాగ్రత్త… మీ చుట్టూనే మానవ మృగాలు తిరుగుతున్నాయ్.. ఈ మానవ మృగాలు మీ ఇంట్లోనే ఉండొచ్చు.. లేదా మీ పక్కింట్లో ఉండొచ్చు.. లేదంటే మీ వీధిలో ఉండొచ్చు.. అవును, తెలిసినవాళ్లే అమ్మాయిలను కాటేస్తున్నారు. నమ్మినవాళ్లే అభంశుభం తెలియని చిన్నారులకు నరకం చూపిస్తున్నారు.

హైదరాబాద్‌ సింగరేణి కాలనీ ఘటనను ఇంకా మరుకముందే తెలంగాణలో మరో ఘోరం జరిగింది. నిజామాబాద్ టౌన్‌లో ఇద్దరు బాలికలపై అత్యాచారం జరిగింది. ముక్కుపచ్చలారని చిన్నారులపై ఓ మృగాడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు.

నిజామాబాద్‌ ఆరో టౌన్‌లో నివాసముండే వసీం.. ఇద్దరు చిన్నారులపై నెలరోజులుగా అత్యాచారం చేస్తున్నాడు. చాక్‌లెట్లు ఆశచూపి రోజూ లైంగిక దాడికి పాల్పడుతున్నాడు.

చిన్నారులిద్దరూ అనారోగ్యానికి గురవడంతో వసీం అకృత్యం బయటపడింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడు వసీంను పోలీసులు అరెస్ట్ చేశారు. చికిత్స నిమిత్తం చిన్నారులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Read also: Sri Krishna Jewellers: భారీ గోల్డ్ స్కామ్‌లో ఈడీ దర్యాప్తు తీవ్రం.. శ్రీ కృష్ణ జ్యువెలర్స్ షాపులన్నింటిలోనూ సోదాలు