I-T searches: ఐటీ సోదాల కలకలం.. 50కి పైగా వ్యాపారులు, కాంట్రాక్టర్ల నివాసాల్లో ఏకకాలంలో దాడులు

బెంగళూరులో ఈ ఉదయం ఒక్కసారిగా ఐటీ సోదాల కలకలం రేగింది. ఏకకాలంలో 50కి పైగా ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు.

I-T searches: ఐటీ సోదాల కలకలం.. 50కి పైగా వ్యాపారులు, కాంట్రాక్టర్ల నివాసాల్లో ఏకకాలంలో దాడులు
Income Tax Raids
Follow us

|

Updated on: Oct 07, 2021 | 12:39 PM

Bangalore I-T searches: బెంగళూరులో ఈ ఉదయం ఒక్కసారిగా ఐటీ సోదాల కలకలం రేగింది. ఏకకాలంలో 50కి పైగా ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. యడ్యూరప్ప సన్నిహితుడి నివాసం సహా పలువురు వ్యాపారులు, కాంట్రాక్టర్ల నివాసాల్లో సోదాలు జరుగుతున్నాయి.

ఇలా ఉండగా, తమిళనాడులోనూ ఐటీ దాడుల పరంపర కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. కాంచీపురం, వేలూరులలో ఉన్న ప్రముఖ వస్త్ర దుకాణాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు తాజాగా సోదాలు చేశారు. ఏక కాలంలో మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో లెక్కల్లో చూపని నల్లధనాన్ని భారీగా గుర్తించినట్టు తెలుస్తోంది.

కాగా, కాంచీపురం, వేలూరు జిల్లాల్లో వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఒక వస్త్ర దుకాణం యజమాని భారీ మొత్తంలో పన్ను ఎగవేతకు పాల్పడినట్టు ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరిగినట్టు సమాచారం. దీనికి సంబంధించి కాంచిలోని గాంధీ రోడ్డు, టీకే నంబి వీధిలో ఉన్న ఈ వస్త్ర దుకాణంలో ఈ సోదాలు చేసి, లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్నారు.

అదే విధంగా వేలూరులోని మరో సిల్క్‌ షోరూమ్‌లో కూడా ఈ సోదాలు చేశారు. అయితే, ఈ దుకాణంలో పనిచేసే సిబ్బందిని ఒక్కరిని కూడా బయటకు పంపించకుండానే తనిఖీలు చేయడం గమనార్హం. షోరూమ్‌తో పాటు క్యాషియర్‌ రూమ్‌, బిల్లింగ్‌ సెక్షన్‌, షోరూమ్‌ గోదాముల్లో తనిఖీలు చేశారు. ఇదిలావుంటే, కాంచీపురం రంగస్వామి కోనేరు వద్ద ఉన్న ఒక ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీలో సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో మొత్తం 54 మంది అధికారులు పాల్గొన్నారు.

మరోవైపు, ఇవాళ హైద‌రాబాద్‌ శ్రీకృష్ణ జ్యువెల‌ర్స్‌లో ఈడీ సోదాలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. మ‌నీ ల్యాండ‌రింగ్‌కు పాల్ప‌డిన‌ట్లు ఆధారాలు గుర్తించిన ఈడీ. శ్రీకృష్ణ జ్యువెల‌ర్స్‌పై గ‌తంలోనే సీసీఎస్‌లో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీసీఎస్ కేసు ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది.

Read also: TTD Member Jupally: తిరుమల శ్రీవారి నవనీత సేవ, దర్శనంలో తరించిన టీటీడీ బోర్డ్ మెంబర్ జూపల్లి రామేశ్వర్ రావు

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??