AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omicron – india: ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ విజృంభిస్తున్న ఒమిక్రాన్.. కీలక నిర్ణయం దిశగా భారత ప్రభుత్వం..!

Omicron - india: కరోనా మహమ్మారి, ఒమిక్రాన్ రూపంలో ప్రపంచంపై పంజా విసిరింది. నెల రోజులు పాటు శాంతించిన వైరస్, మళ్లీ పలు దేశాల్లో విజృంభిస్తోంది. దీంతో అప్రమత్తమైంది కేంద్ర సర్కార్. చైనా, హాంకాంగ్, సింగ్‌పూర్,

Omicron - india: ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ విజృంభిస్తున్న ఒమిక్రాన్.. కీలక నిర్ణయం దిశగా భారత ప్రభుత్వం..!
Shiva Prajapati
|

Updated on: Mar 18, 2022 | 6:00 AM

Share

Omicron – india: కరోనా మహమ్మారి, ఒమిక్రాన్ రూపంలో ప్రపంచంపై పంజా విసిరింది. నెల రోజులు పాటు శాంతించిన వైరస్, మళ్లీ పలు దేశాల్లో విజృంభిస్తోంది. దీంతో అప్రమత్తమైంది కేంద్ర సర్కార్. చైనా, హాంకాంగ్, సింగ్‌పూర్, దక్షిణ కొరియా సహా పలు దేశాల్లో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమయ్యింది కేంద్రం. దేశంలో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై సమీక్ష కోసం, అత్యుతన్న స్థాయి సమావేశం నిర్వహించారు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ. జీనోమ్ సీక్వెన్సింగ్, పర్యవేక్షణతో పాటు అప్రమత్తతంగా ఉండాలని మాండవియా సూచించారు. మార్చి 27 నుంచి అంతర్జాతీయ విమాన ప్రయాణ సర్వీసుల ప్రారంభించాలనే నిర్ణయంపై కూడా సమీక్షించినట్టు తెలుస్తోంది. అయితే, దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నాయి అధికార వర్గాలు. విమాన సర్వీసులు పునరుద్ధరిస్తారా? లేక తాజాగా పరిస్థితుల కారణంగా వాయిదా వేస్తారా అన్నది చూడాలి.

ఇప్పుడైతే, దేశంలో కరోనా కేసులు స్వల్ప సంఖ్యలో నమోదవుతున్నా, జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని స్పష్టం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం దేశంలో 3 వేలకు దిగువనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. మృతుల సంఖ్య కూడా వందలోపే ఉంటోంది. ప్రస్తుతం దేశంలో 33 వేల వరకు యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు పరిస్థితి అదుపులోనే ఉన్నా, ఇకపై ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు నిపుణులు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా, భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు వైద్యులు. దేశంలో ఇప్పటి వరకూ 4కోట్ల 29 లక్షల 98వేల 938 మంది కరోనా బారినపడ్డారు. దేశంలో రికవరీ రేటు 98.72 శాతంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అటు టీకాల పంపిణీపై దృష్టిపెట్టింది కేంద్ర ప్రభుత్వం. అందరూ తప్పకుండా వ్యాక్సిన్‌ వేసుకునేలా చూడాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది సెంట్రల్‌ గవర్నమెంట్.

Also read:

Telangana: అంతా బావే చెశాడు.. మ్యాటర్ తెలిసిన తరువాత ఆ యువతి ఏం చేసిందంటే..

Puzzle Picture: ఈ ఫోటోలో ఒక వీరుడు దాగున్నాడు.. ఎక్కడ ఉన్నాడో కనిపెట్టగలరా?

Viral Video: దెయ్యమే ఆ పని చేసిందా.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న షాకింగ్ వీడియో..!