మామిడి చెట్టు ఎక్కిన మంచువారమ్మాయి
దేశవ్యాప్తంగా లాక్డౌన్ పకడ్భందీగా అమలవుతోంది. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరమితమయ్యారు. లాక్డౌన్ సామాన్యులు ఇబ్బందులు పడుతుంటే సెలబ్రిటీలు మాత్రం ఈ కాలాన్ని తమకు నచ్చినట్టుగా ఉపయోగించుకోవడం విశేషం. అలాగే ఇంట్లో చేసే పనులు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో..
దేశవ్యాప్తంగా లాక్డౌన్ పకడ్భందీగా అమలవుతోంది. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరమితమయ్యారు. లాక్డౌన్ సామాన్యులు ఇబ్బందులు పడుతుంటే సెలబ్రిటీలు మాత్రం ఈ కాలాన్ని తమకు నచ్చినట్టుగా ఉపయోగించుకుంటున్నారు. అలాగే ఇంట్లో చేసే పనులు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఎందుకంటే ఎప్పుడూ షూటింగ్స్తో హడావిడిగా ఉంటారు. కుటుంబానికి సమయం కేటాయించింది తక్కువే ఉంటుంది. కొంతమంది వంటలు చేస్తుంటే.. మరికొందరు మాత్రం ఛాలెంజ్లు విసురుతున్నారు. ఇక లక్ష్మీ మంచు అయితే ఏకంగా చెట్లు కూడా ఎక్కేస్తుంది. ఇటీవల తన గారాల పట్టి విద్యా నిర్వాణ మామిడి కాయలు కావాలంటే.. తన ఇంటి ముందున్న మామిడి చెట్టు ఎక్కి మరీ విద్యాకి ఇచ్చింది. అయితే ఈ చెట్టు తమ ఇంట్లో చిన్నప్పటి నుంచి ఉన్నా ఏ రోజూ దానిని పలకరించలేదట. కనీసం దానితో సమయం కూడా కేటాయించలేదట. లాక్డౌన్లో ఎలాంటి పనులు లేకపోవడంతో ఇంట్లో ఉన్న ప్రతి చెట్టుని పలకరిస్తున్నా అని చెప్పుకొచ్చింది లక్ష్మీ.
Read More:
హైపర్ ఆది పెళ్లి డేట్ ఫిక్స్.. అమ్మాయిది ఏ జిల్లా అంటే!
సీఎం కేసీఆర్కు ఆర్జీవీ దిమ్మతిరిగే ఛాలెంజ్..