AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LPG Gas: మళ్ళీ పెరిగిన గ్యాస్ ధరలు.. ఈసారి అంత పెరిగిందా? కొత్త రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా?

LPG Gas: మళ్ళీ పెరిగిన గ్యాస్ ధరలు.. ఈసారి అంత పెరిగిందా? కొత్త రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా?

Phani CH
|

Updated on: Jun 02, 2026 | 7:53 PM

Share

జూన్ 1 నుంచి దేశవ్యాప్తంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు మరోసారి పెరిగాయి. ఢిల్లీలో రూ.42, కోల్‌కతాలో రూ.53.50 వరకు పెంపు నమోదైంది. గృహ వినియోగ గ్యాస్ ధరలు యథాతథంగా ఉన్నప్పటికీ, హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాలపై భారం పెరగనుంది. దీని ప్రభావం ఆహార పదార్థాల ధరల రూపంలో సామాన్యుల జేబుపై పరోక్షంగా పడే అవకాశం కనిపిస్తోంది.

మన రోజువారీ జీవితంలో అత్యంత కీలకమైన వస్తువు ఏది అంటే.. అందరూ చెప్పే మొదటి సమాధానం వంటగ్యాస్. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతీ ఇంట్లోనూ, ప్రతీ హోటల్‌లోనూ గ్యాస్ సిలిండర్ వాడకం తప్పనిసరి. జూన్ 1వ తేదీ నుంచి దేశంలో గ్యాస్ సిలిండర్ ధరలకు సంబంధించి ఒక అతి పెద్ద అప్‌డేట్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచేశాయి! ఢిల్లీలో ఏకంగా 42 రూపాయలు పెరిగింది. మరి ఈ ధరల పెంపు ప్రభావం ఎవరిపై పడబోతోంది? అసలు ఇళ్లలో వాడే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల పరిస్థితి ఏంటి? సామాన్య ప్రజలకు ఏమైనా ఊరట లభించిందా? లేక అందరి జేబులకూ చిల్లు పడబోతోందా? ప్రతీ నెల 1వ తేదీన ప్రభుత్వ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు, ఎల్పీజీ ధరల ఆధారంగా ఇక్కడ రేట్లను సమీక్షిస్తుంటాయి. ఈ క్రమంలోనే జూన్ 1న కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరపై రూ.42 పెంచారు. ఈ పెంపుతో ఢిల్లీలో ఇప్పటివరకు రూ.3,071.50 గా ఉన్న కమర్షియల్ సిలిండర్ ధర.. నేటి నుంచి ఏకంగా రూ.3,113.50 కి చేరింది. అంటే కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,100 మార్కును దాటేసిందన్నమాట. కేవలం ఢిల్లీ మాత్రమే కాదు, కోల్‌కతాలో అయితే ఈ పెంపు మరీ ఘోరంగా ఉంది. అక్కడ ఏకంగా రూ.53.50 పైసలు పెంచేశారు. దీంతో కోల్‌కతాలో ఒక కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,255.50 కి చేరింది. అదే విధంగా ముంబై, చెన్నై నగరాల్లో కూడా ఈ ధరలు భారీగా పెరిగాయి. చెన్నైలో రూ.46 పెరగడంతో అక్కడ కొత్త ధర రూ.3,283 గా ఉంది. ముంబైలో కమర్షియల్ సిలిండర్ రేట్ రూ.3,067.50 కి చేరింది. మరి మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటో తెలుసా? దేశంలోనే అత్యధికంగా కమర్షియల్ గ్యాస్ ధరలు ఉన్న నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా నిలిచింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,294 కి చేరింది. బీహార్ రాజధాని పాట్నాలో అయితే ఇది రూ.3,322 గా ఉంది.” కమర్షియల్ గ్యాస్ ధరలు పెరగడం ఇదే మొదటిసారి కాదు. గడిచిన ఐదు నెలల్లో కమర్షియల్ గ్యాస్ ధరలు పెరిగిన తీరు చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఒక రకంగా చెప్పాలంటే ఐదు నెలల్లో ఈ రేట్లు దాదాపు రెట్టింపు అయ్యాయి. ఈ ఏడాది జనవరిలో ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర కేవలం రూ.1,691.50 గా ఉండేది. ఫిబ్రవరి 1వ తేదీన దీనిపై రూ.49 పెంచారు. మార్చి నెలలో మరో రూ.115 భారీగా పెంచారు. ఇక ఏప్రిల్ నెలలో అయితే ఊహించని విధంగా ఏకంగా రూ.993 ఒకేసారి పెంచేసి అందరికీ షాక్ ఇచ్చారు. మే నెలలో ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగించారు. ఇప్పుడు జూన్ 1న మళ్ళీ రూ.42 పెంచారు. చూశారుగా.. జనవరిలో రూ.1,691 గా ఉన్న సిలిండర్, ఈరోజు జూన్ వచ్చేసరికి రూ.3,113 దాటిపోయింది. అంటే కేవలం ఐదు నెలల వ్యవధిలోనే రూ.1,400 కంటే ఎక్కువ భారం వ్యాపార రంగంపై పడింది. ఇంత వేగంగా ధరలు పెరగడం వ్యాపారులకు కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి. చిన్న వ్యాపారులు ఉపయోగించే 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల ధరలను కూడా రూ.11 మేర పెంచారు. దీంతో ఢిల్లీలో 5 కేజీల సిలిండర్ ధర రూ.821.50 కి చేరింది. ఇక్కడ సామాన్య మధ్యతరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం, చమురు సంస్థలు ఒక పెద్ద ఊరటనిచ్చాయి అని చెప్పవచ్చు. హోటళ్లు, రెస్టారెంట్లలో వాడే కమర్షియల్ గ్యాస్ ధరలను పెంచినప్పటికీ.. ఇళ్లలో వాడే వంటగ్యాస్ సిలిండర్ల ధరలలో ఎలాంటి మార్పూ చేయలేదు. గృహ వినియోగ గ్యాస్ ధరలను యథాతథంగా ఉంచారు. ప్రస్తుతం వివిధ నగరాల్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలను పరిశీలిస్తే ఢిల్లీ: రూ.913.00, ముంబై:రూ. 912.50, కోల్‌కతా: రూ.939.00, చెన్నై: రూ. 928.50 గా ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా డొమెస్టిక్ సిలిండర్ల ధరలు ఎక్కడా మారలేదు, పాత ధరలే కొనసాగుతున్నాయి. కాబట్టి సామాన్య గృహిణులు లేదా కుటుంబాల బడ్జెట్‌పై నేరుగా ఎలాంటి తక్షణ భారం పడటం లేదు. అయితే కమర్షియల్ సిలిండర్ ధర పెరిగితే మనకెందుకులే అని సామాన్యులు అనుకుంటే పొరపాటే! దీని వల్ల పరోక్షంగా సామాన్యుడిపై ప్రభావం పడక తప్పుదు. డొమెస్టిక్ గ్యాస్ రేట్లు పెరగలేదు కదా అని హ్యాపీగా ఉండలేరు. ఎందుకంటే కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను ఎక్కువగా ఎవరు వాడుతుంటారు? హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు, టీ స్టాళ్లు, దాబాలు, క్యాటరింగ్ వ్యాపారులు, స్వీట్ షాపుల వారు వీటిని భారీగా ఉపయోగిస్తారు. ఇప్పుడు ఐదు నెలల్లో గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ. 1,400 పెరిగిపోవడంతో ఈ హోటల్, ఫుడ్ ఇండస్ట్రీపై విపరీతమైన భారం పడుతోంది. వ్యాపారులకు నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగిపోతున్నాయి. ఒక హోటల్ నిర్వహించాలంటే కేవలం గ్యాస్ మాత్రమే కాదు.. ఇటీవల కాలంలో రవాణా ఖర్చులు కూడా పెరిగాయి. ఢిల్లీ, పరిసర ప్రాంతాలలో సిఎన్‌జి ధరలు మే మధ్య కాలం నుండి కిలోకు రూ. 6 వరకు పెరిగి రూ.83.09 కి చేరాయి. ముంబైలో నేడు మరో రూ.2 పెరిగి రూ.86 కి, చెన్నైలో రూ.1 పెరిగి రూ.96 కి చేరింది. పెట్రోల్, డీజిల్ ధరలు కూడా గత కొన్ని వారాల్లో లీటరుకు రూ.7.35 నుండి రూ.7.53 వరకు పెరిగాయి. ఒకవైపు రవాణా ఖర్చులు, మరోవైపు కమర్షియల్ గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో హోటల్ యజమానులకు రెండు ఆప్షన్లు మాత్రమే మిగిలాయి. ఒకటి.. పెరిగిన ఖర్చులను తామే భరిస్తూ లాభాలను తగ్గించుకోవడం. రెండు.. ఆ అదనపు భారాన్ని కస్టమర్లపై వేయడం. వ్యాపారాలు నడవాలంటే లాభాలు ఉండాలి కాబట్టి, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో హోటళ్లలో టిఫిన్లు, బిర్యానీలు, కూరలు, కాఫీ, టీల ధరలు పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. సామాన్యుడి గ్యాస్ సిలిండర్ ధర నేరుగా పెరగకపోయినా, బయట తినే ఆహార పదార్థాల రూపంలో పరోక్షంగా జేబు ఖాళీ అవ్వడం ఖాయం!” అసలు అంతర్జాతీయ మార్కెట్లో ఏం జరుగుతోంది? మన దేశంలో గ్యాస్ ధరలు ఎందుకు ఈ స్థాయిలో పెరుగుతున్నాయి? దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా ఉన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు. ముఖ్యంగా పశ్చిమ ఆసియా ప్రాంతంలో జరుగుతున్న యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన సరఫరాకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. గ్లోబల్ ఎనర్జీ కాస్ట్స్ పెరిగిపోవడంతో బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు దాాదపు100 డాలర్లుగా ఉంది. భారతదేశం తన అవసరాలకు అవసరమైన ఇంధనంలో అత్యధిక భాగం.. దిగుమతుల పైనే ఆధారపడుతోంది. అక్కడ రేట్లు పెరిగితే మన దేశంలోనూ ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ సరఫరా అంతరాయాలు, ఇంధన భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఒక కీలక వ్యూహాన్ని రచిస్తోంది. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ ఇటీవల ఒక మీడియా బ్రీఫింగ్‌లో కీలక విషయాలు తెలిపారు. దేశంలో భవిష్యత్తులో ఎలాంటి ఇంధన కొరత రాకుండా ఉండేందుకు గాను, ప్రభుత్వ రంగ చమురు కంపెనీలను కనీసం 30 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలను అత్యవసర స్టాక్‌గా ఉంచుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. ప్రభుత్వం చెప్పినదానిని బట్టి చూస్తే.. ప్రస్తుతానికి దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సరఫరాకు ఎలాంటి ఢోకా లేదు. దేశీయ రిఫైనరీలు అన్నీ పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఎల్పీజీ ఉత్పత్తి రోజుకు రికార్డు స్థాయిలో 54,000 టన్నులకు చేరింది. ప్రజలు ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదని, కాకపోతే వ్యవసాయ డిమాండ్, బల్క్ సేల్స్ వల్ల కొన్ని చోట్ల అసాధారణ అమ్మకాలు జరుగుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. మొత్తానికి డొమెస్టిక్ గ్యాస్ రేట్లు మారకపోవడం గృహిణులకు పెద్ద ఊరటే అయినప్పటికీ, కమర్షియల్ గ్యాస్, సిఎన్‌జి ధరల పెంపు వల్ల హోటల్ ఫుడ్ ప్రియులపై, వ్యాపార వర్గాలపై పరోక్షంగా భారం పడక తప్పదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దోమలపై కత్తికట్టిన గూగుల్.. 3.2 కోట్ల దోమల విడుదలకు రెడీ

చుక్క రక్తంతో క్యాన్సర్‌ గుట్టురట్టు.. మన నిమ్స్‌లో ఫ్రీగానే పరీక్ష!

యువకుడిగా ఉండగా పరీక్ష.. వృద్ధుడయ్యాక వచ్చిన కొలువు!

తండ్రి ప్రేమ.. కొడుకు హోంవర్క్‌ చేద్దామని ప్రయత్నిస్తే..

రబ్బరు పడవలో 30 గంటల జర్నీ.. కుటుంబాన్ని కలవడం కోసం సాహసం

Follow Us