AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Covid-19: ఆ 12 రాష్ట్రాల్లోనే కరోనా కేసులు అధికం.. మరికొన్ని రాష్ట్రాల్లో తగ్గుతున్నాయ్.. కేంద్రం

India Coronavirus: దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ విలయతాండవం కొన‌సాగుతూనే ఉన్న‌ది. గ‌త రెండు రోజుల నుంచి వ‌రుస‌గా నాలుగు ల‌క్ష‌ల‌కుపైగానే

India Covid-19: ఆ 12 రాష్ట్రాల్లోనే కరోనా కేసులు అధికం.. మరికొన్ని రాష్ట్రాల్లో తగ్గుతున్నాయ్.. కేంద్రం
India Corona
Shaik Madar Saheb
|

Updated on: May 07, 2021 | 7:07 PM

Share

India Coronavirus: దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ విలయతాండవం కొన‌సాగుతూనే ఉన్న‌ది. గ‌త రెండు రోజుల నుంచి వ‌రుస‌గా నాలుగు ల‌క్ష‌ల‌కుపైగానే కొత్త కేసులు న‌మోద‌వుతుండగా.. మూడు వేలమందికి పైగా బాదితులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీందో పలు రాష్ట్రాల్లో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కర్ఫ్యూ, లాక్‌డౌన్ విధించినప్పటికీ.. కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, గుజ‌రాత్‌, త‌మిళ‌నాడు, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, ప‌శ్చిమ‌బెంగాల్‌, హర్యానా, బీహార్‌లోనే కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ 12 రాష్ట్రాల్లోనే భారీగా కేసులు వెలుగులోకి వస్తున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ అద‌న‌పు కార్య‌ద‌ర్శి ఆర్తి అహుజా శుక్రవారం వెల్లడించారు.

అయితే.. మ‌హారాష్ట్ర‌, తెలంగాణ‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఢిల్లీ, రాజ‌స్థాన్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, గుజ‌రాత్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఇటీవ‌ల కేసులు బాగా పెరిగి.. మళ్లీ క్ర‌మంగా త‌గ్గుతున్నాయ‌ని ఆర్తి అహుజా వివరించారు. పంజాబ్‌, జ‌మ్ముక‌శ్మీర్‌, అస్సాం, హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌, పుదుచ్చేరి, మేఘాల‌యా, త్రిపుర‌, అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌, నాగాలాండ్ రోజూవారీ కొత్త కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతూ వ‌స్తుందని.. తెలిపారు. గతంలో నమోదైన గణాంకాలను పరిశీలిస్తే.. క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ప‌శ్చిమ‌బెంగాల్‌, బీహార్‌, హ‌ర్యానా, ఒడిశా, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాల్లో కేసులు బాగా పెరుగుతున్నాయ‌ని ఆర్తి అహుజా తెలిపారు.

ఇదిలాఉంటే.. దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్ర‌క్రియ కూడా వేగవంతంగా కొసాగుతుంద‌ని ఆర్తి ఆహుజా వివరించారు. ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 16.50 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చిన‌ట్లు ఆమె తెలిపారు. కాగా.. 18-44 ఏండ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న వారికి కూడా ఇప్ప‌టివ‌ర‌కు 11.81 ల‌క్ష‌ల డోసుల టీకాలు ఇచ్చిన‌ట్లు వివరించారు.

Also Read:

Breaking News: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నైట్‌ కర్ఫ్యూ పొడిగింపు.. ఉత్తర్వులు జారీ..

Indian Railways: కరోనా ఎఫెక్ట్‌.. దూరంతో, రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ సహా 28 రైళ్లు రద్దు.. ఎప్పటివరకంటే..?

Follow Us
పాక్ నిష్క్రమణపై క్రికెట్ ఫ్యాన్స్ ఘాటు వ్యాఖ్యలు
పాక్ నిష్క్రమణపై క్రికెట్ ఫ్యాన్స్ ఘాటు వ్యాఖ్యలు
నేటి నుంచి కొత్త రూల్స్.. కొత్తగా అమల్లోకి వచ్చేవి ఇవే..
నేటి నుంచి కొత్త రూల్స్.. కొత్తగా అమల్లోకి వచ్చేవి ఇవే..
హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై టెన్షన్ ప్రీ జర్నీ!
హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై టెన్షన్ ప్రీ జర్నీ!
దుబాయ్‌లో చిక్కుకున్న హీరోయిన్.. రక్షించాలని మోదీకి రిక్వెస్ట్
దుబాయ్‌లో చిక్కుకున్న హీరోయిన్.. రక్షించాలని మోదీకి రిక్వెస్ట్
ఇమ్యూనిటీని పెంచే లెమన్ కేక్ ఇలా చేస్తే ఆ వ్యాధులన్ని మటాష్
ఇమ్యూనిటీని పెంచే లెమన్ కేక్ ఇలా చేస్తే ఆ వ్యాధులన్ని మటాష్
డబ్బులు రాలేదు.. కానీ సౌండ్ వచ్చింది.. వ్యాపారులకు కుచ్చుటోపీ..
డబ్బులు రాలేదు.. కానీ సౌండ్ వచ్చింది.. వ్యాపారులకు కుచ్చుటోపీ..
కోచ్ చేతిలో నువ్వు డమ్మీవా? సల్మాన్‌ను కడిగిపారేసిన విలేకరులు
కోచ్ చేతిలో నువ్వు డమ్మీవా? సల్మాన్‌ను కడిగిపారేసిన విలేకరులు
భారత్‌పై ఇరాన్-ఇజ్రాయెల్ ఎఫెక్ట్.. పెరగనున్న ఈ ధరలు..
భారత్‌పై ఇరాన్-ఇజ్రాయెల్ ఎఫెక్ట్.. పెరగనున్న ఈ ధరలు..
అప్పుడు థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..
అప్పుడు థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..
రాత్రి కాదు పగటిపూటే పక్కా ప్లాన్.. ఇరాన్‌పై యూఎస్, ఇజ్రాయెల్..
రాత్రి కాదు పగటిపూటే పక్కా ప్లాన్.. ఇరాన్‌పై యూఎస్, ఇజ్రాయెల్..