కర్నాటకలో కరోనా మహమ్మారి తాండవం.. ఒక్క రోజే 7,883 కేసులు నమోదు
గత 24 గంటల్లో కొత్తగా 7,883 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 113 మంది మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 1,96,494కి, మరణాల సంఖ్య 3,510కి చేరింది. ఇక 24 గంటల్లో 7,034 కరోనా రోగులు డిశ్చార్జ్..
కర్నాటక రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారి తీవ్రత కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. ఇప్పటికే సామాన్యులతో పాటు ఎంతో మంది రాజకీయ నాయకులు, సినీ, క్రీడా ప్రముఖులు ఈ వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 7,883 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 113 మంది మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 1,96,494కి, మరణాల సంఖ్య 3,510కి చేరింది. ఇక 24 గంటల్లో 7,034 కరోనా రోగులు డిశ్చార్జ్ కాగా, మొత్తం ఇప్పటివరకు 1,12,633 మంది కోలుకున్నట్లు కర్నాటక ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక ప్రస్తుతం 80,343 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read More:
పనికి రావడం లేదని 12 ఏళ్ల బాలుడిని చావగొట్టిన యజమాని
కరోనా నుంచి కోలుకున్న డైరెక్టర్ రాజమౌళి కుటుంబం
దేశ వ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ వర్షాలు, కర్నాటకకి ఎల్లో అలెర్ట్