ఏఎస్ ఐకి క‌రోనా పాజిటివ్..ట‌చ్‌లో మ‌రో ఐదుగురు పోలీసులు

వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు అమ‌లు చేస్తున్న పోలీసు యంత్రాంగాన్ని క‌రోనా కాటువేస్తోంది. తాజాగా రాజ‌ధాని న‌గ‌రంలో ఓ ఏఎస్ ఐకి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది.

ఏఎస్ ఐకి క‌రోనా పాజిటివ్..ట‌చ్‌లో మ‌రో ఐదుగురు పోలీసులు
Follow us

|

Updated on: Apr 25, 2020 | 12:10 PM

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడిచేయడానికి విధించిన లాక్‌డౌన్ రెండో దశ కొనసాగుతోంది. ఈ దశలోనే వైరస్‌ను నియంత్రించి, సాధారణ పరిస్థితిని తీసుకువ‌చ్చేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నిస్తోంది. ఈ క్ర‌మంలో వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు అమ‌లు చేస్తున్న పోలీసు యంత్రాంగాన్ని క‌రోనా కాటువేస్తోంది. తాజాగా రాజ‌ధాని న‌గ‌రంలో ఓ ఏఎస్ ఐకి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది.
దేశ‌రాజ‌ధాని ఢిల్లీలోని జామా మ‌సీద్ పీఎస్ ప‌రిధిలో విధులు నిర్వ‌హిస్తున్న ఏఎస్ ఐకి క‌రోనా వ‌చ్చిన‌ట్లు ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు. దీంతో ఏఎస్ ఐని ఐసోలేష‌న్ వార్డుకు త‌ర‌లించి చికిత్స అంద‌జేస్తున్నారు. ..అత‌నితో  డైరెక్ట్ కాంటాక్ట్‌లో ఉన్న మ‌రో ఐదుగురు పోలీసుల‌ను క్వారంటైన్ త‌ర‌లించారు. ఏఎస్ ఐకి క‌రోనా పాజిట‌వ్ నిర్ధార‌ణ అయిన వెంట‌నే జామా మ‌సీద్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో మ‌రికొంత మంది పోలీసుల న‌మూల‌ను టెస్టింగ్‌కు పంపిన‌ట్లు అధికారులు చెప్పారు.
Assistant Sub-Inspector