AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Curfew: ఏపీలో క‌ర్ఫ్యూ స‌మ‌యం మ‌రింత పెంచే అవ‌కాశం.. రేపు సీఎం జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం

ఏపీలో ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ప్ప‌టికీ క‌రోనా వ్యాప్తి అదుపులోకి రావ‌డం లేదు. క‌ర్ఫ్యూను కొంద‌రు లైట్ తీసుకుంటున్న‌ట్లు ప్ర‌భుత్వానికి నివేదిక అందింది.

Andhra Curfew: ఏపీలో క‌ర్ఫ్యూ స‌మ‌యం మ‌రింత పెంచే అవ‌కాశం.. రేపు సీఎం జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం
Cm Jagan
Ram Naramaneni
|

Updated on: May 16, 2021 | 12:40 PM

Share

ఏపీలో ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ప్ప‌టికీ క‌రోనా వ్యాప్తి అదుపులోకి రావ‌డం లేదు. క‌ర్ఫ్యూను కొంద‌రు లైట్ తీసుకుంటున్న‌ట్లు ప్ర‌భుత్వానికి నివేదిక అందింది. దీంతో ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌ల దిశ‌గా అడుగులు వేస్తుంది. క‌ర్ఫ్యూ స‌మ‌లింపు స‌మ‌యాన్ని ఉద‌యం 6 గంట‌ల నుంచి 9 గంట‌ల‌వ‌ర‌కు లేదా 6 గంటల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు కుదించే విష‌యాన్ని ప‌రిశీలిస్తుంది. సోమ‌వారం అధికారులు, ప‌లువురు మంత్రుల‌తో చ‌ర్చించిన అనంత‌రం సీఎం జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్నారు. మ‌రోవైపు ఏపీలో పాజిటివిటీ రేటుపై కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్థ‌న్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. పాజిటివిటీ విష‌యంలో ఏపీ దేశంలో 10 వ స్థానంలో ఉంద‌న్నారు. పాజిటివిటీ రేటు పది శాతం దాటితేనే లాక్ డౌన్ విధించాలని ఐసీఎంఆర్‌ సూచిస్తోంది. అలాంటిది ఏపీలో ఇప్పటికే ఈ పాజిటివిటీ రేటు ఇరవై శాతానికి ద‌గ్గ‌రిగా ఉందన్న‌ది అన‌ధికార స‌మాచారం. విశాఖ, తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాలలో మరింత ఆందోళనకరంగా పరిస్థితులు ఉన్నాయి.

రాష్ట్రంలో నిర్వహిస్తోన్న ఫీవర్ సర్వేలో కరోనా పాజిటివ్‌ రేటు అధికంగా ఉన్న‌ట్లు అధికారులు గుర్తించారు. కఠినంగా కర్ఫ్యూ అమలు చేస్తున్నా పాజిటివ్‌ కేసులు పెరగడంపై ప్రభుత్వం ఆలోచనలో పడింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అన్నీ బంద్ చేస్తున్నారు. అత్యవసరమైన మెడికల్ కు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. వారం నుంచి ఈ నిబంధనలు అమలు అవుతున్నా.. కరోనా మాత్రం కట్టడి కావడం లేదు. దీంతో ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌ల‌కు న‌డుం బిగించింది.

Also Read:  మరణం అంచున ఉన్న తల్లికోసం కొడుకు పాడిన ఆ పాట నెటిజన్ల హృదయాలు కదిలిస్తోంది!

ఇంట్లో తండ్రి మృతదేహాం.. త‌ల్లిని కాపాడుకునేందుకు క్యూ లైన్ లో యువ‌కుడి ఆరాటం..