సీఎం కేసీఆర్ కీలక ప్రకటన
కరోనా మహమ్మారి తెలంగాణ ప్రజల్ని పట్టి పీడిస్తోందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల వివరాలను ప్రకటిస్తూ.. కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రీన్ జోన్.. ఆరెంజ్ జోన్.. రెడ్ జోన్ అని కాకుండా.. అన్ని జిల్లాల్లో మే 29 వరకూ రాత్రి 7 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే గ్రీన్, ఆరెంజ్ జోన్లలో కొన్ని సడలింపులు ఇస్తున్నట్లు ప్రకటించారు. మండల కేంద్రం, […]
కరోనా మహమ్మారి తెలంగాణ ప్రజల్ని పట్టి పీడిస్తోందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల వివరాలను ప్రకటిస్తూ.. కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రీన్ జోన్.. ఆరెంజ్ జోన్.. రెడ్ జోన్ అని కాకుండా.. అన్ని జిల్లాల్లో మే 29 వరకూ రాత్రి 7 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే గ్రీన్, ఆరెంజ్ జోన్లలో కొన్ని సడలింపులు ఇస్తున్నట్లు ప్రకటించారు. మండల కేంద్రం, గ్రామీణ ప్రాంతాల్లో అన్ని షాపులకు అనుమతి ఉంటుందని తెలిపారు. అయితే మున్సిపాలిటీ ప్రాంతాల్లో మాత్రం 50 శాతం వరకు మాత్రమే షాపులకు అనుమతి ఇస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. అయితే సోషల్ డిస్టెన్స్ పాటించకపోతే.. సడలింపులను రద్దు చేస్తామన్నారు. మే 15వ తేదీ తర్వాత మళ్లీ రివ్యూ మీటింగ్ నిర్వహించి.. మరిన్ని సడలింపులు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
కాగా.. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1096కి చేరుకుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనాను జయించి.. ఆస్పత్రుల నుంచి మొత్తం 628 మంది డిశ్చార్జి అయ్యారని పేర్కొన్నారు. ఇక మంగళవారం నాడు కూడా 43 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు.