AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Suryavanshi : పాక్‌తో ఓటమి.. షూ చూపించడం ఏంటి? వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ సీరియస్!

Vaibhav Suryavanshi :దుబాయ్ వేదికగా జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్ చేతిలో టీమిండియా 191 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. టోర్నీ ఆరంభం నుంచి అజేయంగా నిలిచిన భారత్, ఫైనల్‌లో మాత్రం చేతులెత్తేయడంపై డిసెంబర్ 22న జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చకు వచ్చింది.

Vaibhav Suryavanshi : పాక్‌తో ఓటమి.. షూ చూపించడం ఏంటి? వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ సీరియస్!
Vaibhav Suryavanshi
Rakesh
|

Updated on: Dec 23, 2025 | 9:55 AM

Share

Vaibhav Suryavanshi :దుబాయ్ వేదికగా జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్ చేతిలో టీమిండియా 191 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. టోర్నీ ఆరంభం నుంచి అజేయంగా నిలిచిన భారత్, ఫైనల్‌లో మాత్రం చేతులెత్తేయడంపై డిసెంబర్ 22న జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చకు వచ్చింది. ఈ ఓటమికి గల కారణాలను విశ్లేషించడానికి ఒక ప్రత్యేక రివ్యూ కమిటీని ఏర్పాటు చేయాలని బోర్డు నిర్ణయించింది. ముఖ్యంగా కీలక సమయంలో జట్టు ఎందుకు విఫలమైందో వివరణ ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్‌ను కోరింది.

ఓటమిపై సమీక్షలో భాగంగా హెడ్ కోచ్ హృషికేశ్ కనిట్కర్, కెప్టెన్ ఆయుష్ మ్హాత్రేలతో బీసీసీఐ అధికారులు నేరుగా మాట్లాడనున్నారు. సాధారణంగా జూనియర్ స్థాయిలో ఇంతటి కఠినమైన సమీక్షలు జరగవు, కానీ త్వరలో జరగబోయే అండర్-19 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు తీసుకుంటున్నారు. వరల్డ్ కప్‌లో ఇలాంటి వైఫల్యాలు పునరావృతం కాకూడదనేది బోర్డు ఉద్దేశం.

ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మ్హాత్రేల ప్రవర్తన కూడా చర్చనీయాంశమైంది. పాక్ బౌలర్ల స్లెడ్జింగ్‌కు బదులిచ్చే క్రమంలో వీరు చూపించిన కొన్ని హావభావాలు, దూకుడు ప్రవర్తనపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ షూ చూపిస్తూ చేసిన సంజ్ఞలు వైరల్ అయ్యాయి. వీరిద్దరి క్రమశిక్షణపై కూడా సమీక్షలో చర్చించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ బోర్డు వీరి తీరును తప్పుబట్టితే, రాబోయే టోర్నీల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

జింబాబ్వే, నమీబియా వేదికలుగా 2026 జనవరిలో ప్రారంభం కానున్న అండర్-19 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించాల్సి ఉంది. ఈలోపే ఈ సమీక్షను పూర్తి చేసి, లోపాలను సరిదిద్దాలని బీసీసీఐ భావిస్తోంది. ఆటలో వైఫల్యం ఒకెత్తు అయితే, మైదానంలో క్రమశిక్షణ తప్పడం మరో ఎత్తు అని బోర్డు పెద్దలు భావిస్తున్నారు. అందుకే ఈసారి క్లీన్ అప్ ప్రక్రియ పక్కాగా ఉండబోతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

షూ చూపించడం ఏంటి? వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ సీరియస్!
షూ చూపించడం ఏంటి? వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ సీరియస్!
హీరోయిన్స్ డ్రెస్‌సెన్స్‌పై శివాజీ షాకింగ్ కామెంట్స్
హీరోయిన్స్ డ్రెస్‌సెన్స్‌పై శివాజీ షాకింగ్ కామెంట్స్
జనవరి 1 నుంచి మారనున్న రూల్స్.. ఇవి తెలుసుకోకపోతే ఇబ్బందే
జనవరి 1 నుంచి మారనున్న రూల్స్.. ఇవి తెలుసుకోకపోతే ఇబ్బందే
Video: కీర్తితో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన స్టార్ హీరో భార్య..
Video: కీర్తితో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన స్టార్ హీరో భార్య..
ఒక్క రాత్రికి 3 కోట్లు.. ఈ భామ బిజినెస్ రేంజ్ మామూలుగా లేదుగా!
ఒక్క రాత్రికి 3 కోట్లు.. ఈ భామ బిజినెస్ రేంజ్ మామూలుగా లేదుగా!
వెయ్యి కోట్లు దాటేసిన క్రేజీ బ్యూటీ.. టాప్ 5లో ఊహించని పేర్లు
వెయ్యి కోట్లు దాటేసిన క్రేజీ బ్యూటీ.. టాప్ 5లో ఊహించని పేర్లు
కూతురు పెళ్లి కబురుతో షాకిచ్చిన సీనియర్​ హీరో.. ఊహించని ట్విస్ట్!
కూతురు పెళ్లి కబురుతో షాకిచ్చిన సీనియర్​ హీరో.. ఊహించని ట్విస్ట్!
సంక్రాంతి స్పెషల్ రైళ్ల షెడ్యూల్స్ వచ్చేశాయి.. వివరాలు ఇవే..
సంక్రాంతి స్పెషల్ రైళ్ల షెడ్యూల్స్ వచ్చేశాయి.. వివరాలు ఇవే..
టెక్నాలజీతో దోస్తీ.. రోబోలతో పోటీ.. మీ పిల్లలను ఇలా రెడీ చేయండి
టెక్నాలజీతో దోస్తీ.. రోబోలతో పోటీ.. మీ పిల్లలను ఇలా రెడీ చేయండి
మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!
మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!