AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్ న్యూస్: తెలంగాణలో వైన్ షాపులకు క్లియర్

ఈ నెల 29వ తేదీ వరకూ లాక్‌డౌన్ పొడిగించారు సీఎం కేసీఆర్. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్రీన్, ఆరెంజ్ జోన్లలో.. అన్ని రకాల షాపులతో పాటు, వైన్ షాపులు తెరుచుకోనున్నట్లు..

బ్రేకింగ్ న్యూస్: తెలంగాణలో వైన్ షాపులకు క్లియర్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 05, 2020 | 11:13 PM

Share

తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ పొడిగించారు సీఎం కేసీఆర్. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేబినేట్ భేటీ ముగిసిన అనంతరం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 29వ తేదీ వరకూ లాక్‌డౌన్ పొడిగించారు సీఎం కేసీఆర్. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జోన్లలో.. అన్ని రకాల షాపులతో పాటు, వైన్ షాపులు తెరుచుకోనున్నట్లు కేసీఆర్ తెలిపారు. అయితే 11 కంటైన్‌మెంట్ జోన్లు మినహా అన్ని చోట్ల మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం కేసీఆర్.

అంతేకాకుండా పేదల తాగే మద్యంపై 11 శాతం, ధనికులు తాగే మద్యంపై 16 శాతం వరకు ధరలను పెంచించింది తెలంగాణ ప్రభుత్వం. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ వైన్‌ షాపులు తెరుచుకోనున్నాయి. మద్యం షాపుల దగ్గర భౌతిక దూరం పాటించాలి. మద్యం కోసం హడావిడి పడొద్దని పేర్కొన్నారు సీఎం. అలాగూ పబ్‌లు, బార్‌లకు అనుమతి లేదన్నారు కేసీఆర్.

కాగా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1096కి చేరుకుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనాను జయించి.. ఆస్పత్రుల నుంచి మొత్తం 628 మంది డిశ్చార్జి అయ్యారని పేర్కొన్నారు. ఇక మంగళవారం నాడు కూడా 43 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని కేసీఆర్ తెలిపారు.

Read More:

బ్రేకింగ్: దేశవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన కేంద్రం

తెలంగాణలో జూన్ 12 నుంచి స్కూల్స్ ఓపెన్.. ఒక్కో గదిలో 20 మందే!

బ్రాహ్ముణులను కించపరిచిందని.. యాంకర్ శ్రీముఖిపై పోలీస్ కేసు..

ఉదయ్ కిరణ్‌ చావుకు ఆ అగ్ర హీరోకి సంబంధం లేదు.. తేల్చిచెప్పిన తేజ!