AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

yuva Prime Minister Scheme : యువత కోసం కేంద్రం సరికొత్త పథకం..! ఎంపికైతే నెలకు 50,000 స్టైఫండ్..

yuva Prime Minister Scheme : యువ రచయితల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ

yuva Prime Minister Scheme : యువత కోసం కేంద్రం సరికొత్త పథకం..! ఎంపికైతే నెలకు 50,000 స్టైఫండ్..
Yuva
uppula Raju
|

Updated on: May 30, 2021 | 5:35 AM

Share

yuva Prime Minister Scheme : యువ రచయితల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఉన్నత విద్యా శాఖ తరపున ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం పేరు యువ. యువ రచయితలకు, కొత్త రచయితలకు సరైన శిక్షణ ఇవ్వడం దీని లక్ష్యం. ఈ పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వ యువ పథకం 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న యువ రచయితల కోసం. దేశంలో పఠనం, రచన, పుస్తకాల సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో భారతదేశం, భారతీయ క్రియేషన్స్ ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లబడతాయి. స్వాతంత్య్ర సంగ్రామం గురించి రాయడానికి యువ రచయితలను ప్రోత్సహించాలనేది ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభిమతం. 31 జనవరి 2021 న ప్రధాని మోదీ తన మన్ కి బాత్ లో ఈ విషయాన్ని ప్రస్తావించారు.

దేశ స్వాతంత్య్ర సంగ్రామం గురించి రాయడానికి యువతరానికి స్ఫూర్తినివ్వాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. స్వేచ్ఛ, ధైర్యం కథలు, ఆయా రంగాలలో స్వాతంత్ర్య పోరాట యుగంతో ముడిపడి ఉన్న సంఘటనల గురించి వారు రాయాలన్నారు. స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కథలు దేశంలోని హీరోలకు నిజమైన నివాళిగా నిలుస్తాయని ప్రధాని మోదీ అభివర్ణించారు. దేశంలో ఇటువంటి విషయాలను పెద్ద సంఖ్యలో వ్రాసే రచయితలు సిద్ధంగా ఉంటారు వారు భారత వారసత్వం సంస్కృతిపై లోతైన అధ్యయనం చేస్తారు. అటువంటి అభివృద్ధి చెందుతున్న ప్రతిభకు మేము పూర్తిగా సహాయం చేయాలి. దీనివల్ల భవిష్యత్ దిశను నిర్ణయించే ఆలోచనాపరుల తరగతి కూడా సృష్టించబడుతుంది. ఈ ప్రయత్నంలో భాగం కావాలని సాహిత్య నైపుణ్యాలను గరిష్టంగా ఉపయోగించుకోవాలని ప్రధాని యువతను ఉద్ధేశించి కోరారు.

నేషనల్ బుక్ ట్రస్ట్, విద్యా మంత్రిత్వ శాఖతో కలిసి ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా సక్రమంగా నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. ఈ పథకం కింద వచ్చే అన్ని పుస్తకాలను నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురిస్తుంది. ఇవి కాకుండా ఇతర భారతీయ భాషల్లోకి కూడా అనువదించబడతాయి. ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ కూడా ప్రచారం చేయబడుతుంది. తద్వారా సంస్కృతి, సాహిత్యాన్ని మార్పిడి చేసుకోవచ్చు. ఎంపికైన యువ రచయితలకు ప్రపంచంలోని అత్యుత్తమ రచయితలను కలవడానికి, సంభాషించడానికి అవకాశం లభిస్తుంది. అదనంగా సాహిత్య ఉత్సవాల్లో కూడా పాల్గొంటారు.

1. ఈ పథకం కింద 75 మంది యువ రచయితలను అఖిల భారత పోటీ ద్వారా ఎంపిక చేస్తారు. 2. యువ రచయితలకు దేశంలోని ప్రసిద్ధ రచయితలు శిక్షణ ఇస్తారు. 3. మెంటర్‌షిప్ సమయంలో 15 డిసెంబర్ 2021 నాటికి అన్ని మాన్యుస్క్రిప్ట్‌లు తయారు చేయబడతాయి. తద్వారా అవి ప్రచురించబడతాయి. 4. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా 2022 జనవరి 12 న పుస్తకాలు ప్రచురించబడతాయి. 5. ఎంపిక చేసిన ప్రతి రచయితకు రూ.50 వేల స్కాలర్‌షిప్ ఇవ్వబడుతుంది అంతేకాదు ఇది రాబోయే 6 నెలల వరకు కొనసాగుతుంది.

AP CM YS Jaganmohan Reddy : ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనకు నేటితో రెండేళ్లు పూర్తి

ఉచిత విద్యుత్‌కు ద‌ర‌ఖాస్తులు చేసుకోండి.. ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలన్న మంత్రి గంగుల

Anil Kumar Yadav : జూమ్‌ పార్టీకి అధ్యక్షుడిగా చంద్రబాబు తయారయ్యాడంటూ మంత్రి అనిల్‌ కుమార్‌ ఎద్దేవా