AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGPSC Exam Dates: తెలంగాణలో సీడీపీవో, ఈవో పోస్టుల రాత పరీక్ష తేదీలు విడుదల.. ఏ పరీక్ష ఎప్పుడంటే

తెలంగాణ రాష్ట్రంలోని మహిళా శిశు సంక్షేమశాఖలో శిశు అభివృద్ధి సంక్షేమ అధికారులు (సీడీపీవో) పోస్టులు 23, ఈవో పోస్టులు 181 భర్తీకి టీజీపీఎస్సీ రీఎగ్జాం షెడ్యూలును ప్రకటించింది. ప్రశ్నపత్రాల లీకేజీల నేపథ్యంలో గతంలో ఈ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షను కమిషన్‌ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేక విచారణ బృందం, ఫోరెన్సిక్‌ నివేదిక ఆధారంగా 2023లో నిర్వహించిన ఈ రాతపరీక్షలను కమిషన్‌ రద్దు చేసి, సీడీపీవో పోస్టుల ఎంపిక..

TGPSC Exam Dates: తెలంగాణలో సీడీపీవో, ఈవో పోస్టుల రాత పరీక్ష తేదీలు విడుదల.. ఏ పరీక్ష ఎప్పుడంటే
TGPSC Exam Dates
Srilakshmi C
|

Updated on: Jul 31, 2024 | 3:34 PM

Share

హైదరాబాద్‌, జులై 31: తెలంగాణ రాష్ట్రంలోని మహిళా శిశు సంక్షేమశాఖలో శిశు అభివృద్ధి సంక్షేమ అధికారులు (సీడీపీవో) పోస్టులు 23, ఈవో పోస్టులు 181 భర్తీకి టీజీపీఎస్సీ రీఎగ్జాం షెడ్యూలును ప్రకటించింది. ప్రశ్నపత్రాల లీకేజీల నేపథ్యంలో గతంలో ఈ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షను కమిషన్‌ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేక విచారణ బృందం, ఫోరెన్సిక్‌ నివేదిక ఆధారంగా 2023లో నిర్వహించిన ఈ రాతపరీక్షలను కమిషన్‌ రద్దు చేసి, సీడీపీవో పోస్టుల ఎంపిక జాబితాను క్యాన్సిల్‌ చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం ఈ పోస్టులకు నియామక పరీక్షలను మళ్లీ నిర్వహించనున్నారు. సీడీపీవో పోస్టులకు 2025 జనవరి 3, 4 తేదీల్లో ఆన్‌లైన్‌ రాత పరీక్షలు జరుగుతాయి. ఈవో పోస్టులకు జనవరి 6, 7 తేదీల్లో జరుగుతాయి. ఈ రెండు పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలోనే జరుగుతాయి. ఈ మేరకు కమిషన్‌ కార్యదర్శి నవీన్‌నికోలస్‌ ఓ ప్రకటనలో తెలిపారు. రాతపరీక్షలకు వారం రోజుల ముందు అధికారిక వెబ్‌సైట్లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. నార్మలైజేషన్‌ విధానంలో మార్కులు లెక్కించి, ర్యాంకులు ప్రకటిస్తామని తెలిపారు.

యూపీఎస్సీ ఈఎస్‌ఈ, సీఎంఎస్‌ఈ 2024 ఫలితాలు విడుదల.. మెరిట్‌ లిస్ట్ ఇదే

యూపీఎస్సీ ‘ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌-2024’ మెయిన్స్‌ పరీక్ష ఫలితాలను కమిషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద యూపీఎస్సీ దేశవ్యాప్తంగా రైల్వే, టెలికాం, డిఫెన్స్‌ సర్వీస్‌ తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో ఇంజినీరింగ్‌ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ ఏడాది జూన్‌ 23వ తేదీన రాత పరీక్ష నిర్వహించించింది. సివిల్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో మొత్తం 167 పోస్టులను భర్తీ చేయనున్నారు. మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన వారికి పర్సనాలిటీ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ పోస్టుల ఫలితాలతోపాటు 827 మెడికల్ ఆఫీసర్, జీడీఎంవో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ‘కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2024’ పరీక్ష ఫలితాలను కూడా యూపీఎస్సీ వెల్లడించింది. ఈపరీక్ష జులై 14న నిర్వహించింది. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్‌లు నిర్వహించి, ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

యూపీఎస్సీ ఈఎస్‌ఈ 2024 మెయిన్స్‌ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

యూపీఎస్సీ సీఎంఎస్‌ఈ 2024 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
బలమైన వెస్టిండీస్‌ను ఢీకొట్టే టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే?
బలమైన వెస్టిండీస్‌ను ఢీకొట్టే టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే?
ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలేం జరిగింది..?
ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలేం జరిగింది..?
ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు
ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!