Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JEE Main 2024: రేపటితో ముగుస్తోన్న జేఈఈ మెయిన్స్‌ దరఖాస్తు గడువు.. చివరి అవకాశం

జేఈఈ మెయిన్స్‌ (జనవరి) 2024 నోటిఫికేషన్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు, కేంద్రప్రభుత్వ నిధులతో నడిచే ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాలు పొందగోరే విద్యార్ధులు జేఈఈ మెయిన్స్‌కు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌లో ఇచ్చిన వివరాల ప్రకారం జేఈఈ మెయిన్స్‌కు దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువు రేపటితో (నవంబర్ 30) తేదీతో ముగియనుంది. గురువారం సాయంత్రం 5 గంటల..

JEE Main 2024: రేపటితో ముగుస్తోన్న జేఈఈ మెయిన్స్‌ దరఖాస్తు గడువు.. చివరి అవకాశం
JEE Main 2024 January
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 29, 2023 | 8:02 AM

హైదరాబాద్‌, నవంబర్‌ 29: జేఈఈ మెయిన్స్‌ (జనవరి) 2024 నోటిఫికేషన్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు, కేంద్రప్రభుత్వ నిధులతో నడిచే ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాలు పొందగోరే విద్యార్ధులు జేఈఈ మెయిన్స్‌కు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌లో ఇచ్చిన వివరాల ప్రకారం జేఈఈ మెయిన్స్‌కు దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువు రేపటితో (నవంబర్ 30) తేదీతో ముగియనుంది. గురువారం సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ వెల్లడించింది. రేపటితో దరఖాస్తులు ముగియనుండగా ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు వెంటనే దరఖాస్తు చేసుకోవల్సిందిగా ఎన్‌టీఏ సూచించింది.

కాగా దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 1వ తేదీన మొదలైన సంగతి తెలిసిందే. జేఈఈ మెయిన్స్‌ తొలివిడత పరీక్ష దేశవ్యాప్తంగా 2024 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకూ జరగనుంది. ఇక రెండోవిడత పరీక్ష వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జరుగుతుంది. జేఈఈ మెయిన్స్‌ మొదటి విడత పరీక్ష ఫలితాలు ఫిబ్రవరి 12న వెల్లడిస్తారు. కోవిడ్‌కాలంలో ఎన్‌సీఈఆర్‌టీ, సీబీఎస్‌ఈ సిలబస్‌ తగ్గించిన సంగతి తెలిసిందే. దీంతో ఈసారి కూడా పరిమిత సిలబస్‌ నుంచి ప్రశ్నలు ఇవ్వనున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన సిలబస్‌నూ తాజాగా విడుదల చేసింది. మ్యాథ్స్‌లో కూడా సుదీర్ఘ జవాబులు రాబట్టే విధానానికి సడలింపు ఇచ్చారు. ఫలితంగా ఈసారి ఎక్కువమంది మెయిన్స్‌ రాసే వీలుందని అంచనా వేస్తున్నారు.

తెలుగు సహా దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం 13 ప్రధాన భాషల్లో జేఈఈ మెయిన్స్‌ పరీక్ష జరుగుతుందని నోటిఫికేషన్‌లో తెల్పింది. జేఈఈ పరీక్ష రాసేందుకు ఎలాంటి వయోపరిమితి లేదు. అంటే ఏ వయసు వారైనా పరీక్ష రాయొచ్చు. అయితే 2022, 2023లో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత పొందిన విద్యార్ధులు మాత్రమే ఈ పరీక్షలకు హాజరుకావడానికి అర్హులు. కాగా ప్రతీయేట జేఈఈ రెండు దశల ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించిన వారిలో దాదాపు 2.5 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

రేపటితో ముగుస్తున్న 10th జవాబుపత్రాల మూల్యాంకనం.. ఫలితాల తేదీ ఇదే
రేపటితో ముగుస్తున్న 10th జవాబుపత్రాల మూల్యాంకనం.. ఫలితాల తేదీ ఇదే
వేసవిలో వేడి నీరు తాగాలా వద్దా..! తెలుసుకోండి
వేసవిలో వేడి నీరు తాగాలా వద్దా..! తెలుసుకోండి
ఇన్విటేషన్‌ ఇలా కూడా పంపుతారా?..కొడుకు పెళ్లికి ఈయనేంచేశారంటే?
ఇన్విటేషన్‌ ఇలా కూడా పంపుతారా?..కొడుకు పెళ్లికి ఈయనేంచేశారంటే?
Video: ఇంత టెన్షన్ టైంలో అలాంటి షాటా.. హార్దిక్‌పై రోహిత్ ఫైర్
Video: ఇంత టెన్షన్ టైంలో అలాంటి షాటా.. హార్దిక్‌పై రోహిత్ ఫైర్
రెబల్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. థియేటర్స్ బ్లాస్ట్ అవ్వాల్సిందే..
రెబల్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. థియేటర్స్ బ్లాస్ట్ అవ్వాల్సిందే..
మరొకరి ఉసురు తీసిన లిఫ్ట్.. బంతిని తీసేందుకు వెళ్లి..
మరొకరి ఉసురు తీసిన లిఫ్ట్.. బంతిని తీసేందుకు వెళ్లి..
పొద్దున వెళ్లి సాయంత్రానికి రాగల టూరిస్ట్ ప్లేస్.. ఇదో వండర్
పొద్దున వెళ్లి సాయంత్రానికి రాగల టూరిస్ట్ ప్లేస్.. ఇదో వండర్
ఇలాంటి లక్షణాలున్న వ్యక్తులతో స్నేహం ప్రమాదకరం అంటున్న చాణక్య..
ఇలాంటి లక్షణాలున్న వ్యక్తులతో స్నేహం ప్రమాదకరం అంటున్న చాణక్య..
డగౌట్ నుంచే ఢిల్లీపై మరణ శాసనం.. బ్రహ్మ రాతనే మార్చేసిన రోహిత్
డగౌట్ నుంచే ఢిల్లీపై మరణ శాసనం.. బ్రహ్మ రాతనే మార్చేసిన రోహిత్
ఇక సర్కారు బడుల్లోనూ నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ క్లాసులు..
ఇక సర్కారు బడుల్లోనూ నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ క్లాసులు..