AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fact Check: బైజుస్‌తో ఏపీ సర్కార్ ఒప్పందంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందించేందుకు విద్యాశాఖ బైజూస్‌ (BYJU's) ఎడ్-టెక్ కంపెనీతో శుక్రవారం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి..

Fact Check: బైజుస్‌తో ఏపీ సర్కార్ ఒప్పందంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన అధికారులు
Ap Govt Mou With Byju's
Srilakshmi C
| Edited By: |

Updated on: Jun 18, 2022 | 7:00 PM

Share

AP Education News: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందించేందుకు సీఎం జగన్ బైజూస్‌ (BYJU’s) ఎడ్-టెక్ కంపెనీతో శుక్రవారం ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మీడియాతో ఈ విధంగా మాట్లాడారు.. ‘ఎడ్-టెక్ కంపెనీ రూపొందించిన కంటెంట్‌ యాక్సెస్ చేసిన ట్యాబ్‌లను ప్రతి ఏడాది 8 వ తరగతిలోకి వచ్చే విద్యార్ధులకు పంపిణీ చేస్తాం. వాళ్లు 9వ తరగతికి చేరే సరికి ఆ ట్యాబ్‌లలోని కంటెంట్‌ అప్‌గ్రేడ్‌ అవుతుంది. ఆ తర్వాత 10వ తరగతిలోకి వెళ్లేసరికి కంటెంట్‌ మళ్లీ అప్‌గ్రేడ్‌ అవుతుంది. ఈ విధంగా ప్రతి ఏడాది 8వ తరగతిలోకి ప్రవేశించే విద్యార్థులకు ట్యాబ్‌లను పంపిణీ చేస్తాం. ఫలితంగా సీబీఎస్సీ పరీక్షల్లో పాస్‌ కావడానికి విద్యార్ధులకు ఉపయోగపడుతుంది. ఈ ఏడాది పాఠ్య పుస్తకాలు ఇప్పటికే ముద్రించబడినందున వచ్చే ఏడాది నుంచి 4 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ద్విభాషా పాఠ్య పుస్తకాల్లో బైజు కంటెంట్‌ను పొందుపరుస్తాం’ అని సీఎం జగన్ అన్నారు.

ఇంకా ఈ విధంగా మట్లాడారు.. ‘బైజూస్‌ కంపెనీ కూడా ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్ధులకు అనుగుణంగా స్పంధించింది. బైజుస్‌ కంటెంట్‌ని యాక్సెస్ చేయడానికి, ఒక ప్రైవేట్ పాఠశాల విద్యార్థికి సుమారుగా రూ. 20,000ల నుంచి రూ. 24,000ల వరకు ఖర్చవుతుంది. ఐతే ఈ విధమైన కంటెంట్‌ను ఉచితంగా అందించేందుకు బైజూస్‌ ముందుకు రావడం శుభపరిణామం. కంటెంట్‌ ఫ్రీ.. ట్యాబ్‌లకు మాత్రమే మనం ఖర్చు పెట్టాలి. ప్రతీ ఏటా 4 లక్షల 70 వేల ట్యాబ్‌లను పంపిణీ చేయడానికి రూ.500 కోట్లకుపైగా ఖర్చవుతుంది. అత్యధిక ఖర్చుతో కూడుకున్నప్పటికీ క్వాలిటీ ఎడ్యుకేషన్‌ ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని’ సీఎం జగన్‌ అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇదీ వాస్తవం: ఒక ట్యాబ్లెట్ ఖరీదు రూ. 4 లక్షల 70 వేలు అవుతుందన్నట్లు  సీఎం జగన్ మాట్లాడారని సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం జరుగుతోంది. 4 లక్షల 70 వేల మంది విద్యార్ధులకు ట్యాబ్ లను పంపిణీ చేస్తున్నట్లు, అందుకు అయ్యే ఖర్చు గురించి ముఖ్యమంత్రి మాట్లాడారు. దీనిపై ఈ విధంగా అధికారులు ట్విటర్ ద్వారా వివరణ ఇచ్చారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

RBI బంగారాన్ని ఎక్కడ దాస్తుందో తెలుసా?
RBI బంగారాన్ని ఎక్కడ దాస్తుందో తెలుసా?
ఈ దేశంలో మన రూ.100 అంటే రూ.1 లక్ష..! ఒక వారం సంపాదనతో లైఫ్ సెటిల్
ఈ దేశంలో మన రూ.100 అంటే రూ.1 లక్ష..! ఒక వారం సంపాదనతో లైఫ్ సెటిల్
నెట్టింట లేడీ సూపర్ స్టార్స్ సందడి.. నయనతార, త్రిష ఫోటోషూట్స్..
నెట్టింట లేడీ సూపర్ స్టార్స్ సందడి.. నయనతార, త్రిష ఫోటోషూట్స్..
ఫైనల్ రేసులో ఆర్సీబీ.. ప్లేఆఫ్స్ నుంచి మాజీ ఛాంపియన్ ఔట్..?
ఫైనల్ రేసులో ఆర్సీబీ.. ప్లేఆఫ్స్ నుంచి మాజీ ఛాంపియన్ ఔట్..?
ఎవరీ సమ్మక్క-సారలమ్మ..? మేడారం వన దేవతల జాతర చరిత్ర తెలుసా..?
ఎవరీ సమ్మక్క-సారలమ్మ..? మేడారం వన దేవతల జాతర చరిత్ర తెలుసా..?
బంగారం ధరలు.. సంచలనంగా మారిన బాబా వంగా అంచనా!
బంగారం ధరలు.. సంచలనంగా మారిన బాబా వంగా అంచనా!
తక్కువ ధరకే మెడిసిన్స్.. ఈ కేంద్ర ప్రభుత్వ యాప్ గురించి తెలుసా..?
తక్కువ ధరకే మెడిసిన్స్.. ఈ కేంద్ర ప్రభుత్వ యాప్ గురించి తెలుసా..?
. ఈ స్టార్ కమెడియన్ గుండు వెనక కన్నీళ్లు తెప్పించే విషాదం
. ఈ స్టార్ కమెడియన్ గుండు వెనక కన్నీళ్లు తెప్పించే విషాదం
చైనా, పాకిస్థాన్‌కు దడ పుట్టిస్తున్న ప్రధాని మోదీ మాస్టర్‌ ప్లాన్
చైనా, పాకిస్థాన్‌కు దడ పుట్టిస్తున్న ప్రధాని మోదీ మాస్టర్‌ ప్లాన్
బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్.. మళ్లీ ధరలు పైకి
బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్.. మళ్లీ ధరలు పైకి