AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fact Check: బైజుస్‌తో ఏపీ సర్కార్ ఒప్పందంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందించేందుకు విద్యాశాఖ బైజూస్‌ (BYJU's) ఎడ్-టెక్ కంపెనీతో శుక్రవారం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి..

Fact Check: బైజుస్‌తో ఏపీ సర్కార్ ఒప్పందంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన అధికారులు
Ap Govt Mou With Byju's
Srilakshmi C
| Edited By: |

Updated on: Jun 18, 2022 | 7:00 PM

Share

AP Education News: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందించేందుకు సీఎం జగన్ బైజూస్‌ (BYJU’s) ఎడ్-టెక్ కంపెనీతో శుక్రవారం ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మీడియాతో ఈ విధంగా మాట్లాడారు.. ‘ఎడ్-టెక్ కంపెనీ రూపొందించిన కంటెంట్‌ యాక్సెస్ చేసిన ట్యాబ్‌లను ప్రతి ఏడాది 8 వ తరగతిలోకి వచ్చే విద్యార్ధులకు పంపిణీ చేస్తాం. వాళ్లు 9వ తరగతికి చేరే సరికి ఆ ట్యాబ్‌లలోని కంటెంట్‌ అప్‌గ్రేడ్‌ అవుతుంది. ఆ తర్వాత 10వ తరగతిలోకి వెళ్లేసరికి కంటెంట్‌ మళ్లీ అప్‌గ్రేడ్‌ అవుతుంది. ఈ విధంగా ప్రతి ఏడాది 8వ తరగతిలోకి ప్రవేశించే విద్యార్థులకు ట్యాబ్‌లను పంపిణీ చేస్తాం. ఫలితంగా సీబీఎస్సీ పరీక్షల్లో పాస్‌ కావడానికి విద్యార్ధులకు ఉపయోగపడుతుంది. ఈ ఏడాది పాఠ్య పుస్తకాలు ఇప్పటికే ముద్రించబడినందున వచ్చే ఏడాది నుంచి 4 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ద్విభాషా పాఠ్య పుస్తకాల్లో బైజు కంటెంట్‌ను పొందుపరుస్తాం’ అని సీఎం జగన్ అన్నారు.

ఇంకా ఈ విధంగా మట్లాడారు.. ‘బైజూస్‌ కంపెనీ కూడా ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్ధులకు అనుగుణంగా స్పంధించింది. బైజుస్‌ కంటెంట్‌ని యాక్సెస్ చేయడానికి, ఒక ప్రైవేట్ పాఠశాల విద్యార్థికి సుమారుగా రూ. 20,000ల నుంచి రూ. 24,000ల వరకు ఖర్చవుతుంది. ఐతే ఈ విధమైన కంటెంట్‌ను ఉచితంగా అందించేందుకు బైజూస్‌ ముందుకు రావడం శుభపరిణామం. కంటెంట్‌ ఫ్రీ.. ట్యాబ్‌లకు మాత్రమే మనం ఖర్చు పెట్టాలి. ప్రతీ ఏటా 4 లక్షల 70 వేల ట్యాబ్‌లను పంపిణీ చేయడానికి రూ.500 కోట్లకుపైగా ఖర్చవుతుంది. అత్యధిక ఖర్చుతో కూడుకున్నప్పటికీ క్వాలిటీ ఎడ్యుకేషన్‌ ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని’ సీఎం జగన్‌ అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇదీ వాస్తవం: ఒక ట్యాబ్లెట్ ఖరీదు రూ. 4 లక్షల 70 వేలు అవుతుందన్నట్లు  సీఎం జగన్ మాట్లాడారని సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం జరుగుతోంది. 4 లక్షల 70 వేల మంది విద్యార్ధులకు ట్యాబ్ లను పంపిణీ చేస్తున్నట్లు, అందుకు అయ్యే ఖర్చు గురించి ముఖ్యమంత్రి మాట్లాడారు. దీనిపై ఈ విధంగా అధికారులు ట్విటర్ ద్వారా వివరణ ఇచ్చారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
60 ఏళ్ల వయసులో మూడో పెళ్లి.. 14 ఏళ్ల చిన్న అమ్మాయితో స్టార్ హీరో
60 ఏళ్ల వయసులో మూడో పెళ్లి.. 14 ఏళ్ల చిన్న అమ్మాయితో స్టార్ హీరో
అందుకే కోహ్లీకి ఇండియాలో ఉండటం ఇష్టంలేదు: లివింగ్‌స్టోన్
అందుకే కోహ్లీకి ఇండియాలో ఉండటం ఇష్టంలేదు: లివింగ్‌స్టోన్
సింగపూర్ నుంచి కన్నవారిని చూసేందుకు వస్తే.. విధి ఆడిన వింత నాటకం
సింగపూర్ నుంచి కన్నవారిని చూసేందుకు వస్తే.. విధి ఆడిన వింత నాటకం
తుపాకీ వదిలి పుస్తకం పట్టి.. 60 ఏళ్ల వయసులో లాసెట్‌లో అదరగొట్టిన
తుపాకీ వదిలి పుస్తకం పట్టి.. 60 ఏళ్ల వయసులో లాసెట్‌లో అదరగొట్టిన
Viral Video: మద్యం మత్తులో ఫారెనర్ యవ్వారం మాములుగా లేదుగా..
Viral Video: మద్యం మత్తులో ఫారెనర్ యవ్వారం మాములుగా లేదుగా..
శుక్రవారం లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే చాలు.. అష్ట ఐశ్వర్యాలు..
శుక్రవారం లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే చాలు.. అష్ట ఐశ్వర్యాలు..
అప్పుడు షార్ట్ ఫిల్మ్ హీరోయిన్.. ఇప్పుడు ఇండస్ట్రీలో..
అప్పుడు షార్ట్ ఫిల్మ్ హీరోయిన్.. ఇప్పుడు ఇండస్ట్రీలో..
కృష్ణవంశీ ఈ అమ్మాయిని హీరోయిన్‏గా తీసుకున్నాడు ఏంటీ అన్నారు..
కృష్ణవంశీ ఈ అమ్మాయిని హీరోయిన్‏గా తీసుకున్నాడు ఏంటీ అన్నారు..
దూసుకొస్తున్న నిద్రపట్టని అదృష్టం.. గురు-శుక్ర యుతితో బంపర్ లక్
దూసుకొస్తున్న నిద్రపట్టని అదృష్టం.. గురు-శుక్ర యుతితో బంపర్ లక్
ఖాన్ సర్ ఇంటిని ముట్టడించిన విద్యార్థులు! చేతులు జోడించి చెప్పిన
ఖాన్ సర్ ఇంటిని ముట్టడించిన విద్యార్థులు! చేతులు జోడించి చెప్పిన