Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైలులో మీ సీటును ఎవరైనా ఆక్రమించారా? టెన్షన్‌ వద్దు.. ఇలా చేయండి!

కొంతమంది ప్రయాణీకులు ఈ రిజర్వ్ చేసిన సీట్లను ఆక్రమిస్తుంటారు. అలాంటి సమయంలో బుక్‌ చేసుకున్న వారు ఇబ్బందులు పడుతుంటారు. తము ఈ సీట్లను బుక్‌ చేసుకున్నామని తెలిపినా వినని వారు చాలా మందే ఉంటారు. ఈ సందర్భంలో మీ సీటును దక్కించుకునేందుకు గొడవ పడకుండా ఇతర సులభమైన మార్గాలున్నాయి. ఒక ప్రయాణీకుడు తన కోచ్‌ను వదిలి వేరే కోచ్‌లో ప్రయాణిస్తే..

Indian Railways: రైలులో మీ సీటును ఎవరైనా ఆక్రమించారా? టెన్షన్‌ వద్దు.. ఇలా చేయండి!
Indian Railways
Follow us
Subhash Goud

|

Updated on: Jan 17, 2024 | 12:57 PM

భారతీయ రైల్వేలో ప్రతిరోజూ దాదాపు 2 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. చాలా మంది ప్రయాణికులు స్లీపర్ లేదా జనరల్ క్లాస్‌లో ప్రయాణిస్తున్నారు. ఏసీ కోచ్‌లలో ప్రయాణించే వారి సంఖ్య దాదాపు 8.50 లక్షలు. తరచుగా ప్రయాణికులు స్లీపర్, ఏసీ కోచ్‌లలో టిక్కెట్లు లేకుండా నేరుగా ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో ఈ కోచ్ రద్దీగా ఉంది. ఈ రద్దీ కారణంగా రిజర్వ్ చేయబడిన ప్రయాణికులు తమ సీట్లకు కూడా చేరుకోలేరు. కొంతమంది ప్రయాణీకులు ఈ రిజర్వ్ చేసిన సీట్లను ఆక్రమిస్తుంటారు. అలాంటి సమయంలో బుక్‌ చేసుకున్న వారు ఇబ్బందులు పడుతుంటారు. తము ఈ సీట్లను బుక్‌ చేసుకున్నామని తెలిపినా వినని వారు చాలా మందే ఉంటారు. ఈ సందర్భంలో మీ సీటును దక్కించుకునేందుకు గొడవ పడకుండా ఇతర సులభమైన మార్గాలున్నాయి.

పెనాల్టీ నిబంధన

రైల్వే డిజి (పిఐబి) యోగేష్ బవేజా ప్రకారం.. ఒక ప్రయాణీకుడు తన కోచ్‌ను వదిలి వేరే కోచ్‌లో ప్రయాణిస్తే జరిమానా చెల్లించుకోవాల్సి ఉంటుందని గుర్తించుకోవాలి. మీరు బుక్‌ చేసుకున్న సీట్లలో ఇతరు ఎవరైనా కూర్చుంటే మీరు వారికి తాము ఈ సీట్లను బుక్‌ చేసుకున్నామని చెప్పాలి. తర్వాత అతను వినకుండా ఉంటే వెంటనే టీటీఈకి ఫిర్యాదు చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

ఫిర్యాదు చేయండి

ఏసీ కోచ్‌లలో మూడు కోచ్‌లలో ఒక టీటీఈ ఉంటారు. టీటీఈ కనిపించకపోతే రైలు సూపరింటెండెన్స్‌కు ఫిర్యాదు చేయవచ్చు. మీరు రైలులోని RPF జవాన్‌కు కూడా ఫిర్యాదు చేయవచ్చు. మీరు TT, TS , RPF సిబ్బందికి నివేదించినప్పుడు వారు మీకు రిజర్వ్ చేయబడిన సీటును పొందడానికి బాధ్యత వహిస్తారు.

ఈ నంబర్‌పై ఫిర్యాదు చేయండి

మీకు TT, TS లేదా RPF జవాన్ల సాయం కూడా కోరవచ్చు. ఒక వేళ రైలులో వారు కనిపించకపోవడం, సహాయం చేయకపోతే, మీరు కంట్రోల్ రూమ్ నంబర్ 182కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఇది కాకుండా మీరు రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139కి కూడా కాల్ చేయవచ్చు. ఇది వివిధ రైల్వే సంబంధిత సేవల కోసం ఒక సాధారణ హెల్ప్‌లైన్ నంబర్.

రైల్ మదద్ సహాయం కూడా తీసుకోవచ్చు

మీరు రైల్వే అధికారిక Rail Madad యాప్‌లో సీటు అందుబాటులో లేని ఫిర్యాదును కూడా నమోదు చేయవచ్చు. ఇది కాకుండా, మీరు రైల్వే X హ్యాండిల్‌లో కూడా ట్వీట్ చేయవచ్చు. మీరు రైల్వే ట్విట్టర్ హ్యాండిల్ లేదా కంట్రోల్ రూమ్‌లో ఫిర్యాదు చేసినప్పుడు అక్కడ ఉన్న ఉద్యోగి మీ PNR నంబర్ నుండి రైలు లొకేషన్‌ను ట్రాక్ చేస్తారు. ఆ తర్వాత రైల్వే సంబంధిత విభాగానికి ఫిర్యాదు అందుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి