AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adani Group: తెలంగాణలో ఆదానీ గ్రూప్‌ భారీగా పెట్టుబడులు.. దావోస్‌లో సీఎం రేవంత్‌రెడ్డి కీలక సమావేశం

తెలంగాణలో కొత్త ప్రభుత్వం పెట్టుబడిదారులకు అత్యంత అనుకూలమైనదని, కొత్త ప్రణాళికాబద్ధమైన విధానాలతో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించాలని, తెలంగాణలో అదానీ గ్రూప్ అధిక వేగంతో అభివృద్ధి చెందుతుంది అని గౌతమ్ అదానీని ఉటంకిస్తూ ప్రకటన పేర్కొంది. ముఖ్యమంత్రి వెంట ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు ఉన్నారు..

Adani Group: తెలంగాణలో ఆదానీ గ్రూప్‌ భారీగా పెట్టుబడులు.. దావోస్‌లో సీఎం రేవంత్‌రెడ్డి కీలక సమావేశం
Cm Revanth Reddy- Adani Group
Subhash Goud
|

Updated on: Jan 17, 2024 | 12:29 PM

Share

అదానీ గ్రూప్ తెలంగాణలో అధిక వ్యాపారాల ద్వారా రూ.12,400 కోట్ల పెట్టుబడిని ప్రకటించినట్లు తెలంగాణ ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్)లో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడుల కోసం అదానీ గ్రూప్ రాష్ట్ర ప్రభుత్వంతో నాలుగు ఎంవోయూలను కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో ప్రభుత్వ అధికారిక ప్రకటన ప్రకారం, అదానీ గ్రీన్ ఎనర్జీ 1350 మెగావాట్ల రెండు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేయడానికి రూ. 5,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. చందనవెల్లిలో డేటా సెంటర్ క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు అదానీకాన్ఎక్స్ డేటా సెంటర్ రూ. 5,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.

అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ తెలంగాణలో ఏడాదికి 6 మిలియన్ టన్నుల సామర్థ్యంతో (MTPA) సిమెంట్ గ్రైండింగ్ యూనిట్‌లో రూ.1,400 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. అలాగే తెలంగాణలోని హైదరాబాద్‌లోని అదానీ ఏరోస్పేస్, డిఫెన్స్ పార్క్‌లోని కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్, క్షిపణి అభివృద్ధి, తయారీ కేంద్రాలలో అదానీ గ్రూప్ ఏరోస్పేస్, డిఫెన్స్ రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులకు అవసరమైన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు, సహాయాన్ని అందజేస్తుందని గౌతమ్ అదానీకి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

తెలంగాణలో కొత్త ప్రభుత్వం పెట్టుబడిదారులకు అత్యంత అనుకూలమైనదని, కొత్త ప్రణాళికాబద్ధమైన విధానాలతో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించాలని, తెలంగాణలో అదానీ గ్రూప్ అధిక వేగంతో అభివృద్ధి చెందుతుంది అని గౌతమ్ అదానీని ఉటంకిస్తూ ప్రకటన పేర్కొంది. ముఖ్యమంత్రి వెంట ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు ఉన్నారు. అదానీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ప్రెసిడెంట్, సీఈఓ ఆశిష్ రాజ్‌వంశీ, తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐటీఈ అండ్ సీ, ఐ అండ్ సీ, జయేశ్ రంజన్, ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ స్పెషల్ సెక్రటరీ విష్ణు వర్ధన్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి